YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

కేంద్రం దిగి రావాలి

కేంద్రం దిగి రావాలి

జగిత్యాల
జగిత్యాల జిల్లా చల్గల్ ప్రధాన రహదారిపైకేంద్ర ప్రభుత్వ నికి వ్యతిరేకంగా టీఆరెస్ కార్యకర్తలు  నిరసనకు దిగారు. కేంద్ర రైతు వ్యతిరేక ప్రభుత్వ వ్యతిరేక విధానాలను నిరసిస్తూ చావు డప్పులతో బీజేపీ  శవయాత్ర జరిపి  దిష్టి బొమ్మ దగ్దం చేసారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఎమ్మెల్సీ ఎల్ రమణ, మున్సిపల్ చేర్పసన్,భోగ శ్రావణి  జెడ్పీ చైపర్సన్ దావా వసంత ప్రజాప్రతినిధు, రైతులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎల్ రమణ మాట్లాడుతూ రైతుల పట్ల బాధ్యత తో కేంద్ర ప్రభుత్వం దిగి రావాలని అన్నారు.  ఒకే దేశం ఒకే విధానం ఉండలని టిఆర్ఎస్ పార్టీ బలపర్చి ఈ కార్యక్రమన్నీ చేపట్టిందని అన్నారు..టిఆర్ఎస్ పార్టీ ఆదేశాల మేరకు తలపెట్టిన రహదారుల నిర్బంధం కార్యక్రమంలో భాగంగా జగిత్యాల రూరల్ మండలం చల్ గల్ లో జగిత్యాల నిజామాబాద్ జాతీయరహదారి నిర్బంధించిన టిఆర్ఎస్ నాయకులు ఈ కార్యక్రమంలో నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్సీ రమణ మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న మంత్రి కిషన్ రెడ్డి బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తెలంగాణ ఎంపీలు కేంద్ర ప్రభుత్వంపై రైతులతో కలిసి పోరాటానికి దిగి రావాలని డిమాండ్ చేశారు.కేంద్ర ప్రభుత్వం వెంటనే దిగివచ్చి దొడ్డు రకాలను కొనుగోలు చేస్తామని చెప్పాలని డిమాండ్ చేశారు.

Related Posts