YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు దేశీయం

గుజరాత్‌ తీరంలో రూ.400 కోట్ల విలువైన హెరాయిన్‌ స్వాధీనం

గుజరాత్‌ తీరంలో రూ.400 కోట్ల విలువైన హెరాయిన్‌ స్వాధీనం

అహ్మదాబాద్‌ డిసెంబర్ 20
గుజరాత్‌ తీరంలో రూ.400 కోట్ల విలువైన భారీగా హెరాయిన్‌ పట్టుబడింది. పాకిస్థాన్‌ నుంచి సముద్ర జలాల ద్వారా అక్రమంగా తరలిస్తున్న మత్తు పదార్థాలను అధికారులు పట్టుకున్నారు. కోస్ట్‌గార్డ్‌, గుజరాత్‌ ఏటీఎస్‌ సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్‌లో భారత జలాల్లో ప్రవేశించిన పాకిస్థాన్‌కు చెందిన ఫిషింగ్‌ బోట్‌ను సీజ్‌ చేశారు. ఇందులో రూ.400 కోట్ల విలువైన 77 కేజీల హెరాయిన్‌ స్వాధీనం చేసుకున్నారు. గంజాయిని తరలిస్తున్న ఆరుగురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Related Posts