YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

గోశాల నిర్మాణం కూల్చివేత కు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డే కారణం - సామ రంగారెడ్డి

గోశాల నిర్మాణం కూల్చివేత కు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డే  కారణం - సామ రంగారెడ్డి

హైదరాబాద్
ఎల్బీనగర్ నియోజకవర్గ పరిధిలోని హస్తినపురం డివిజన్ సంతోషి మాత ఆలయంలో నిర్మాణం లో ఉన్న గోశాల కూల్చివేతకు ఎల్బీనగర్ ఎమ్మెల్యే  సుదీర్ రెడ్డి నే కారణమని రంగారెడ్డి అర్బన్  జిల్లా బీజేపీ  అధ్యక్షుడు సామ రంగారెడ్డి ఆరోపించారు. ఎల్బీనగర్ జీహెచ్ఎంసీ  సర్కిల్ కార్యాలయం ముందు సంతోషిమాత ఆలయ అర్చకులతో కలిసి ఆందోళన చేపట్టారు. ఎమ్మెల్యే ఆదేశాలతోనే  జీహెచ్ఎంసీ సిబ్బంది గోశాల నిర్మాణం కూల్చివేయడం జరిగిందని,హిందూ దేవాలయాలలో నిర్మాణాలు  కూల్చివేసే అధికారులు ఇతర మతాల నిర్మాణాలు కానరావా అని ప్రశ్నించారు. కాలనీ వాసుల ముసుగులో ఎమ్మెల్యే సుదీర్ రెడ్డి  ఆలయం స్థలంపై  కన్ను వేసి  2013 నుంచి   ఆలయ అభివృద్ధి కి విఘాతం కల్పిస్తున్నడని ఆరోపించారు. కూల్చి వేత  జరిగిన చోట   గోశాల నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి కార్పొరేటర్లు,నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Related Posts