YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

కేంద్రమంత్రి వ్యాఖ్యాలు అభ్యంతకరం

కేంద్రమంత్రి వ్యాఖ్యాలు అభ్యంతకరం

హైదరాబాద్
తెలంగాణ మంత్రులు ఢిల్లీకి వస్తే, కేంద్ర మంత్రి పీయుష్ గోయల్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరంగా వున్నాయని మంత్రి హరీశ్ రావు అన్నారు. బుధవారం అయన మీడియాతో మాట్లాడారు. మంత్రులు  నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల తరుపున.. 70 లక్షల మంది రైతు కుటుంబాల తరఫున ప్రజా ప్రతినిధులుగా ఢిల్లీకి వచ్చారు. అలాంటివారిని "మీకేం పనిలేదా" అని అవమానిస్తారా? ఇది తెలంగాణ రైతులను, తెలంగాణ ప్రజలను అవమాన పరచడమే. * పీయూష్ గోయల్ చేసిన వ్యాఖ్యలు తక్షణం ఉపసంహరించు కావాలి... వెంటనే తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని అయన అన్నారు.
ఆయన కేంద్ర మంత్రిగా కాకుండా రాజకీయ నాయకుడిగా మాత్రమే వ్యవహరించారు.   ఒక రాష్ట్రానికి సంబంధించి ఆరుగురు మంత్రుల కంటే ఇంకా పెద్ద డెలిగేషన్ ఉంటుందా? రాష్ట్ర ప్రతినిధుల బృందాన్ని  కలువకుండా ముందు మీ బీజేపీ నేతలను పిలిపించుకుని మాట్లాడతావా?  కలుస్తవా లేదా... మీ పార్టీ నాయకులను ముందు కలుస్తావా.. మీ ప్రాధాన్యం ఏంటి?.  * అబద్ధాలు, అసత్య ప్రచారాలు, అభాండాలు, గోబెల్స్ ప్రచారం తో రాజకీయం చేసింది నువ్వు.  మీ ప్రాధాన్యం రాజకీయం..మా ప్రాధాన్యం రైతులని అన్నారు.
 ధాన్యం కొంటారా కొనరా.. చెప్పండి అని మంత్రుల బృందం వస్తె.. కలవడానికి సమయం లేదు అంటారా. వానాకాలంలో మీరు ఇచ్చిన 40 LMT టార్గెట్ పూర్తయింది. ఇప్పటికే యాభై లక్షల మెట్రిక్ టన్నుల కొన్నాం. మరో ముప్పై లక్షల మెట్రిక్ టన్నులు వచ్చేలా ఉంది. రైతులు చలిలో కల్లాల దగ్గర ఉంటున్నారు.  వీటిని కొంటారా కొనరా అని అడగడానికి మంత్రులు వస్తే అవమానిస్తారా.   యాసంగి లో బాయిల్డ్ రైస్ కొనమని చెప్పారు.. భవిష్యత్తులో రా రైస్ కూడా కొనం అంటే ఏం చేయాలి?   మంత్రులను అవమానించే హక్కు నీకు ఎక్కడిది? తెలంగాణ ప్రజలను, రైతులను, అవమనిచడం హేయమైన చర్య. ఇంతకంటే దారుణం ఏం ఉండదని అన్నారు.  టీఆరెఎస్ పుట్టిందే తెలంగాణ కోసం. రాష్ట్ర రైతు ప్రయోజనాల కంటే మాకు ఏది ముఖ్యం కాదు. అందుకే డిల్లీ వచ్చాం. మాట తప్పింది మీరు.. మాట మార్చింది మీరు.  మళ్ళీ మేము రాజకీయం చేస్తున్నాం అంటున్నారు.  రాష్ట్ర ఏర్పాటు విషయంలో నాడు కాకినాడ తీర్మానం చేసి వెనక్కి తగ్గింది బీజేపీ కాదా? ఒక్క ఓటు రెండు రాష్ట్రాల సిద్ధాంతం మీది.  ఎవరు రాజకీయం చేస్తున్నారో.. రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు. *తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని మంట కలిపే విధంగా పీయూష్ గోయల్ చేసిన  వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోవాలి. రైతులకు క్షమాపణ చెప్పాలి.   రైతుల ఓట్లు కావాలి కానీ.. వాళ్లు పండించిన ధాన్యం వద్దా??.. బిజెపి కుటిల నీటికి ఇది నిదర్శనం.  రాష్ట్ర రైతాంగాన్ని ప్రజలను అవమాన పరిచే హక్కు మీకు లేదు..  దేశం మొత్తం ఒకే విధానం ఉండాలని మేము అంటున్నాం. పంజాబ్ లో మొత్తం కొంటున్నట్లే.. మా దగ్గర కొనాలి అంటున్నాం. దానికి సమాధానం చెప్పకుండా... డొంక తిరుగుడుగా మాట్లాడుతున్నారు.   విద్యుత్, సాగునీరు రాష్ట్రాల బాధ్యత. మా పని మేము వంద శాతం చేస్తున్నాం. ప్రపంచంలో ఎక్కడా లేనవిధంగా ఉచిత కరెంట్, రైతు బంధు, రైతు బీమా ఇస్తున్నాం. గోదాములు కట్టాం, మార్కెట్లు అభివృద్ధి చేశాం. రైతులకు ఎరువులు విత్తనాలను సకాలంలో అందేలా చేస్తున్నాం.   పంటల కొనుగోళ్ళు కేంద్రం పరిధిలో ఉంది.  మీరు మీ బాధ్యతను విస్మరించారు. చేతకాకపోతే  రాష్ట్రాలకు అధికారాలు బదిలీ చేయండి. మావల్ల కాదు  అని మీరు చేతులెత్తేస్తే రైతులే గుణపాఠం చెబుతారు.  మీ బాధ్యత మీరు నిర్వర్తించరు. మా మంత్రులను అవమనిస్తరు.  పట్టపగలు రైతుల మీద కార్లు ఎక్కించి చంపిన కేంద్ర మంత్రి కొడుకును సిట్ నివేదిక ఇచ్చినా ఎందుకు అరెస్ట్ చేయలేదు. రైతులపై మీకున్న గౌరవం అది.   ఎన్నికల్లో మీరు ఓడిపోలేదా... ఎందుకు అంత విర్ర వీగుతున్నరు. ఇటీవల ఎన్నికల్లో ఎన్ని సిట్టింగ్ స్థానాలు కోల్పోలేదు. ఎమ్మెల్సీగా రామచంద్రరావు ఓడిపోలేదా?    వానాకాలం ధాన్యం కొనుగోలు విషయంలో మాట్లాడరు.  వచ్చే యాసంగి ధాన్యం కొనుగోలు గురించి మాట్లాడరు. ఇంకా పైగా అసత్య ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు.

Related Posts