YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం సినిమా తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్

టాలీవుడ్ లో రాజకీయ రంగు

టాలీవుడ్ లో  రాజకీయ రంగు

విజయవాడ, డిసెంబర్ 24,
ఇంతకీ జనం సినిమా వాళ్ల మీద ఆధారపడ్డారా? సినిమా వాళ్లే జనం మీద ఆధారపడ్డారా? అన్నది ఆంధ్రప్రదేశ్ లో హాట్ టాపిక్ గా మారింది. సినిమా అంశం రాజకీయ రంగు పులుముకుంది. సినిమా టిక్కెట్లను తగ్గిస్తూ ప్రభుత్వం 35 నెంబరు జీవో జారీ చేసింది. ఈ జీవోపై కొందరు న్యాయస్థానాన్ని ఆశ్రయించగా హైకోర్టు దీనిని కొట్టివేసింది. దీంతో థియేటర్ల యాజమాన్యం ఊపిరి పీల్చుకుంది. కానీ ప్రభుత్వం మాత్రం కావాలని థియేటర్లపై దాడులు చేస్తూ భయానక వాతావరణం సృష్టిస్తుందని సినీ పరిశ్రమలోని ఒక వర్గం ఆరోపిస్తుంది. ప్రభుత్వం కక్ష సాధింపు ధోరణితోనే వ్యవహరిస్తుందని సినీ పరిశ్రమలో కొందరు ఆరోపిస్తున్నారు. వినోదానికి సంబంధించిన అంశంపై ఏకపక్షంగా వ్యవహరిస్తుందని విమర్శిస్తున్నారు. నోటీసులు ఇవ్వకుండా థియేటర్లను పరిశీలించి సీజ్ చేయడం పట్ల అభ్యంతరం వ్యక్తమవుతోంది. చిన్న చిన్న కారణాలను చూపి పదుల సంఖ్యలో ఉపాధి కల్పిస్తున్న సినీ పరిశ్రమను దెబ్బతీస్తుందని ప్రభుత్వంపై ఒక వర్గం ఆరోపణలు చేస్తుంది. సామాన్యులకు.. కానీ డబ్బులు ప్రజల నుంచి తీసుకుని ఏమాత్రం సదుపాయాలు కల్పించని థియేటర్లపైనే చర్యలు తీసుకుంటున్నామని ప్రభుత్వం చెబుతోంది. కనీసం సదుపాయాలు లేకపోవడం, మరుగుదొడ్లను శుభ్రంగా ఉంచకపోవడం, థియేటర్లలో నాణ్యమైన ఆహారాన్ని అందించకపోవడం వంటి వాటిపై ప్రభుత్వం సీిరియస్ గా ఉంది. ఇవన్నీ ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని చేసినవేనని చెబుతున్నాయి. సామాన్య ప్రజలకు వినోదాన్ని అతి తక్కువ ధరకు అందించాలన్నదే ప్రభుత్వ ఉద్దేశ్యమని ప్రభుత్వం చెబుతోంది.

Related Posts