YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు

సైనికుల ప్రయోజనాలే దేశానికి అతి ముఖ్యం: రాష్ట్రపతి

 సైనికుల ప్రయోజనాలే దేశానికి అతి ముఖ్యం: రాష్ట్రపతి

 సైనికుల ప్రయోజనాలే దేశానికి అతి ముఖ్యమైనవని రాష్ట్రపతి రామ్‌నాథ్  కోవింద్ తెలిపారు. ప్రపంచంలోని అత్యంత ఎత్తయిన ప్రదేశంలో ఉన్న యుద్ధ క్షేత్రం సియాచిన్‌లో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ గురువారం పర్యటించారు. అత్యంత కఠిన పరిస్థితుల్లో సైనికులు అందిస్తున్న సేవలను ప్రశంసించారు. వారి ప్రయోజనాలే దేశానికి అతి ముఖ్యమైనవని తెలిపారు. ఆయనతోపాటు ఇండియన్ ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్, నార్తర్న్ కమాండ్, జీఓసీ-ఇన్-సీ లెఫ్టినెంట్ జనరల్ డి అంబు కూడా ఉన్నారు. జమ్మూ-కశ్మీరులోని నుబ్రా లోయలో ఉన్న చిన్న గ్రామం, సైనిక స్థావరం థోయిస్‌ చేరుకున్న తర్వాత రాష్ట్రపతి సియాచిన్ వెళ్ళారు. ఈ మంచు ఖండంపై ఏరియల్ సర్వే నిర్వహించారు. ఓ ఫార్వర్డ్ పోస్ట్‌లోని సిబ్బందితో సంభాషించారు.సియాచిన్ బేస్ క్యాంప్‌లో సియాచిన్ యుద్ధ స్మారకాన్ని రాష్ట్రపతి సందర్శించారు. భారతదేశానికి సేవ చేస్తూ అమరులైన సైనికుల సంస్మరణార్థం దీనిని నిర్మించారు. ఇక్కడ ఆయన అమరులకు నివాళులర్పించారు. అనంతరం సైనిక దళాలను ఉద్దేశించి మాట్లాడారు. అత్యంత కఠిన పరిస్థితుల్లో సైనికులు అందిస్తున్న సేవలను ప్రశంసించారు. వారి ప్రయోజనాలే దేశానికి అతి ముఖ్యమైనవని తెలిపారు.

Related Posts