YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆటలు

50 సెంచరీలు పూర్తి చేసుకున్న ఐపీఎల్..!!

 50 సెంచరీలు పూర్తి చేసుకున్న ఐపీఎల్..!!

 ఐపీఎల్ మొదలయి 10  సంవత్సరాలు  పూర్తి అవుతుంది. ఈ 10 సంవత్సరాలు క్రికెట్ అభిమానులకి ఎంతో ఉల్లాసాన్ని ఇచ్చింది , ఎన్నోవింతలు చేసింది. ఇపుడు మరో  రికార్డు నమోదు అయింది. నిన్న ఢిల్లీ - హైదరాబాద్ మ్యాచ్ లో రిషబ్ పంత్ చేసిన సెంచరీ తో మొత్తం ఐపీఎల్ లో 50 సెంచరీలు నమోదు అయ్యాయి. 2008లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ ఆటగాడు బ్రెండన్‌ మెక్‌కలమ్‌ రాయల్ ఛాలెంజర్స్‌ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో 158 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ఇదే ఐపీఎల్‌లో మొదటి శతకం. 2016లో అత్యధికంగా ఏడు శతకాలు నమోదు అయ్యాయి. ఈ సీజన్‌లో విరాట్‌ కోహ్లీనే నాలుగు శతకాలు సాధించడం విశేషం.
 

Related Posts