YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

బీజేపిపై మండిపడ్డ మంత్రి బొత్స

బీజేపిపై మండిపడ్డ మంత్రి బొత్స

అనంతపురం
ఆంధ్రప్రదేశ్ మునిసిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, బీజేపీపై మరోసారి అసహనం వ్యక్తం చేసారు. తాము అధికారంలోకి వస్తే చీప్ లిక్కర్ ను 50కే పంపిణీ చేస్తామంటూ బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీరాజు చేసిన వ్యాఖ్యలపై మంత్రి బొత్స స్పందించారు. అనంతపురం జిల్లా పుట్టపర్తిలో మీడియాతో మాట్లాడిన మంత్రి బొత్స, బీజేపీ ప్రజలకు ఎటువంటి సందేశం ఇస్తుందో అందరికి అర్థమైందని అన్నారు. అధికారంలోకి వస్తే మద్యం ధరలు తగ్గించడమనే విషయం చాలా హాస్యాస్పదంగా ఉందన్న మంత్రి బొత్స, ఈ విషయంపై మాట్లాడటానికి చాలా అసభ్యకరంగా చాలా ఇబ్బంది కరంగా ఉందన్నారు. ఇన్ని చేస్తున్న బీజేపీ నేతలకు..ఏపీలో తమ ప్రభుత్వం మద్యం ధరలు పెంచినట్టు కనిపించడం ఆశ్చర్యకరంగా ఉందని బొత్స వ్యాఖ్యానించారు. బీజేపీ నేతలు మద్యాన్ని ఒక నిత్యావసర వస్తువుగా భావించడం అది వారి విజ్ఞతకే వదిలేస్తున్నానంటూ మంత్రి బొత్స అన్నారు. రాజకీయాలను బీజేపీ ఏ విధంగా తూకం వేస్తుందో ఆ పార్టీ నేతల మాటల్లో తెలిసిపోతుందంటూ మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శించారు.

Related Posts