YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

కులాల కుంపటిని రెచ్చగోడుతున్న వైకాపా

కులాల కుంపటిని రెచ్చగోడుతున్న వైకాపా

చిత్తూరు
రాష్ట్రంలో కులాల కుంపటి రెచ్చగొట్టి, కులాల మధ్య చిచ్చు పెట్టడానికి ప్రభుత్వం పైన ఉన్న వ్యతిరేకతను నుండి ప్రజల దృష్టి మరల్చడానికి ప్రశాంత్ కిషోర్ వ్యూహం లో లో భాగంగానే ఈ రోజు రాష్ట్రంలో అంబేద్కర్ మరియు ఎన్టీఆర్ విగ్రహాల పైన దాడి జరుగుతోందని తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి సప్తగిరి ప్రసాద్ అన్నారు. . ఉద్దేశపూర్వకంగానే విగ్రహాలపై దాడి జరపడం, పోటీ విగ్రహాలు పెట్టడం ప్రజల్లో ఆశాంతి  నెలకొల్పడం, జరుగుతున్నది.  ప్రజల్లో విద్వేషాలను రెచ్చగొట్టడం, మనోభావాలు దెబ్బ తీయటం రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఉద్దేశ్యము. రాష్ట్ర అధికార యంత్రాంగం, పోలీసు యంత్రాంగం పూర్తిగా శాంతిభద్రతలను కాపాడడంలో విఫలమైంది. ప్రజలు అప్రమత్తమై ఇటువంటి కుట్రల నుండి బయట పడాలని, రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి కుల రాజకీయాలు గమనించి తగిన రీతిలో బుద్ధి చెప్పాలని తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తున్నామని అయన అన్నారు.

Related Posts