YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

డీజీపీ మహేందర్ రెడ్డి లాంటి వారి వలనే పోలీస్ శాఖ నాశనం

డీజీపీ మహేందర్ రెడ్డి లాంటి వారి వలనే పోలీస్ శాఖ నాశనం

హైదరాబాద్ జనవరి 3
డీజీపీ మహేందర్ రెడ్డిపై బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మహేందర్ రెడ్డి టీఆర్ఎస్ కు అమ్ముడుపోయాడని తీవ్ర విమర్శలు గుప్పించారు. మహేందర్ రెడ్డి లాంటి వారి వలనే పోలీస్ శాఖ నాశనమవుతోందని వ్యాఖ్యలు చేశారు. సీఎం కేసీఆర్‌కు  మహేందర్ రెడ్డి  చెంచాగిరి చేస్తున్నారని అన్నారు. కేసీఆర్ తాగుబోతు ముఖ్యమంత్రి..  టీఆర్ఎస్ కార్యకర్తలు తాగుబోతులంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇనాళ్ళు ఇంట్లో పడుకున్న  కేసీఆర్.‌. హడావుడిగా జీవో 317తీసుకొచ్చారన్నారు. ఉద్యోగులతో సంప్రదింపులు ఎందుకు జరపటం లేదో.. టీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పాలని ఎంపీ డిమాండ్ చేశారు. భార్యా..‌ పిల్లల దగ్గరకు కూడా పోనివ్వకుండా హౌస్ అరెస్టులు చేయడం దుర్మార్గమన్నారు. గన్నారం గ్రామం దగ్గర టీఆర్ఎస్ కార్యకర్తలు తనను అడ్డుకుంటే..‌ నిజామాబాద్, కరీంనగర్ సీపీలు ఏమి చేస్తున్నారని ప్రశ్నించారు. గులాబీ నాయకులు చేసే కార్యక్రమాలకు పోలీస్ లాఠీలకు కన్పించటం‌లేదా? అని నిలదీశారు. బీజేపీ అంటే సీఎం కేసీఆర్‌కు భయం పట్టుకుందన్నారు. ఇద్దరు ముగ్గురు అధికారులు మినహా.. పోలీసులంతా కేసీఆర్‌కు వ్యతిరేకంగా ఉన్నారని తెలిపారు. 317జీవోను రాజకీయ నేతలకు వర్తింపచేస్తే.. హరీష్, కేటీఆర్‌లు వాళ్ళ నియోజకవర్గాలను వదలాల్సిందే అని ఎంపీ అరవింద్  అన్నారు.

Related Posts