YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

నీ తండ్రి విగ్రహాలు తప్ప రాష్ట్రంలో మహానుభావులవి ఉండకూడదా.? -కింజరాపు అచ్చెన్నాయుడు

నీ తండ్రి విగ్రహాలు తప్ప రాష్ట్రంలో మహానుభావులవి ఉండకూడదా.? -కింజరాపు అచ్చెన్నాయుడు

అమరావతి
అధికారాన్ని అడ్డంపెట్టుకుని ప్రజాధనాన్ని లూఠీ చేసి కట్టబెట్టిన నీ తండ్రి విగ్రహాలు తప్ప రాష్ట్రంలో మహానుభావుల విగ్రహాలు ఉండకూడదా. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు.  వైసీపీ అధికారంలోకి వచ్చాక ఎన్టీఆర్, అంబేద్కర్  విగ్రహాలను ఇష్టానుసారంగా ధ్వంసం చేస్తున్నారు. దుర్గిలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ధ్వంసం చేశారంటే కోట్లాది తెలుగు ప్రజల మనోభావాలు దెబ్బతీసినట్లే. తెలుగు జాతి ఆరాధ్య దైవం ఎన్టీఆర్ విగ్రహం ధ్వంసం చేయడమంటే తెలుగుజాతిని అవమానించడమే. ఇంతటి నీచమైన వ్యక్తులు రాష్ట్రంలో ఉండటం దౌర్భాగ్యం. విగ్రహ ధ్వంసానికి పాల్పడి, మారణాయుదాలతో ప్రజలను భయపెట్టిన వారిపై ఐపీసీ సెక్షన్ 294, 427 లాంటి నామమాత్రపు కేసులు పెట్టారు. హత్యాయత్నం కేసు ఎందుకు నమోదు చేయలేదు.? విగ్రహ ధ్వంసాన్ని నిరసిస్తూ ఆందోళన తెలిపిన వారిపై క్రిమినల్ కేసులు బనాయిస్తారా.? టీడీపీ వారిపై పెట్టిన కేసులను తక్షణమే పోలీసులు వెనక్కి తీసుకుని, అరెస్టు చేసిన వారిని వదిలిపెట్టాలి. శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు లేదా.? జగన్ రెడ్డి వచ్చాక ప్రశాంతమైన పల్నాడును ఫ్యాక్షన్ కు అడ్డాగా మారుస్తున్నారు. భావితరాలకు స్ఫూర్తినిచ్చే వ్యక్తుల విగ్రహాల జోలికి వెళ్లొద్దని వైసీపీని హెచ్చరిస్తున్నాం. విగ్రహాలు కూల్చి రాజకీయాలనుకుంటే ప్రజలు విశ్వసించరు. ఇప్పటికే చాలాసార్లు విగ్రహాలు ధ్వంసం చేశారు. వారిపై ఇప్పటికీ చర్యలు లేవు. రాష్ట్రంలోని ప్రధాన సమస్యలను పక్కదారి పట్టించేందుకే ఇలాంటి దుర్మార్గాలకు పాల్పడుతున్నారు. మరోసారి ఎన్టీఆర్ విగ్రహాల జోలికివస్తే ఊరుకునేది లేదని అన్నారు.

విగ్రహ ధ్వంసం దుర్మార్గం..
ప్రభుత్వం పై వెల్లువెత్తుతోన్న ప్రజాగ్రహాన్ని పక్కదారి పట్టించేందుకు  తెలుగుదేశం వ్యవస్థాపకులు దివంగత నందమూరి తారకరామారావు విగ్రహాల ధ్వంసానికి వైసీపీ తెగబడటం చాలా దుర్మార్గమని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. నిన్న దుర్గి, నేడు తాడికొండలో మహానాయకుడు ఎన్టీఆర్ విగ్రహాలని విద్వేషంతో పగలగొట్టారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన నుంచి ప్రతిపక్షంపైనా, ప్రశ్నించే ప్రజలపైనే కాదు..దేవతామూర్తులు, మహనీయుల విగ్రహాలపైనా దాడులు సర్వసాధారణమైపోయాయి. ఎన్టీఆర్ విగ్రహాల విధ్వంసంతో వైసీపీ తన పతనాన్ని తానే కొని తెచ్చుకుంటోంది. అధికారమదంతో రహదారిపై వున్న విగ్రహాలను కూలగొడుతున్న జగన్రెడ్డి అండ్ కో...ప్రజలు తమ గుండె గుడిలో కట్టుకున్న ఎన్టీఆర్ విగ్రహాన్ని ఎప్పటికీ కూలదోయలేరని అయన అన్నారు.

Related Posts