YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

అక్రమ కేసులకు బెదిరిపోం.. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

అక్రమ కేసులకు బెదిరిపోం.. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

కరీంనగర్
సీఎం బీజేపీ కార్యకర్తలను భయపెట్టాలని చూస్తున్నారు. మీ తాటాకు చప్పుళ్లకు, అక్రమ కేసులను బెదిరిపోయే వాళ్ళం కాదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. బీజేపీ కార్యకర్తల్లారా మీకు కేంద్ర ప్రభుత్వం అండగా ఉంటుంది.  సంజయ్  చేసిన దీక్ష సంఘ విద్రోహ చర్య నా ? ఎందుకు విధ్వంసం చేశారు.  మాకు న్యాయస్థానాల మీద పూర్తి నమ్మకం ఉంది.  కెసిఆర్ గారు మీరు ధర్నా చౌక్ లో ధర్నా చేయవచ్చు మేము చేయవద్దా ?  హౌజ్ అరెస్ట్ లు ఎందుకు?  తెలంగాణ ఉద్యమంలో కూడా ఇంత నిర్భందం, నియంతృత్వం చూడలేదు.  నిజాం తరహా పాలన చేస్తున్నారు కెసిఆర్ అని అన్నారు. తెలంగాణ సమాజం, మేధావులు ఆత్మ పరిశీలన చేసుకోండి.. ఇలాంటి పాలన కోసమా మనం త్యాగాలు చేసి తెలంగాణ తెచ్చుకుంది.  తెలంగాణ సమాజం ఈ నియంతృత్వ పాలనకు చరమగీతం పాడుతుంది అని నాకు పూర్తి విశ్వాసం ఉంది.  పోలీసులారా చట్టాన్ని కొందరికి చుట్టం చేయకండి.  ప్రజా పోరాటాల మీద లక్ష్మణ రేఖ దాటకండి.  ఢిల్లీలో రైతులు ఉద్యమం చేస్తే వారికి ప్రభుత్వం అన్ని వసతులు కల్పించింది కానీ ఇలా చెయ్యలేదు.  ఈ సంఘటన పై అమిత్ షా కి పిర్యాదు చేసానని వెల్లడించారు.

Related Posts