YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

నడ్డా మతిస్థిమితం కోల్పోయారు

నడ్డా మతిస్థిమితం కోల్పోయారు

హైదరాబాద్
నడ్డా బీజేపీ జాతీయ అధ్యక్షుడు కాదు భ్రష్టా చార్ జనతా పార్టీ అధ్యక్షుడు. ...నడ్డా సొంత రాష్ట్రం హిమాచల్ లో బీజేపీ ఒక లోక్ సభ సీటు తో పాటు మూడు అసెంబ్లీ సీట్లను ఉప ఎన్నికల్లో కోల్పోయిందని పియూసీ చైర్మన్, ఎమ్మెల్యే ఏ. జీవన్ రెడ్డి అన్నారు. బుధవారం అయన టీ ఆర్ ఎస్ ఎల్పీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. నడ్డా ముందు ఇంట గెలిచి రచ్చ గెలవాలి. సొంత రాష్ట్రం లో బీజేపీ ఓడిపోవడం తో నడ్డా మతి స్థిమితం కోల్పోయాడు. నడ్డా అబద్ధాల బిడ్డ గా మారి మిషన్ భగీరథ లో నీళ్లు రాలేవంటున్నారు. ఇంతకన్నా హాస్యాస్పదం ఉంటుందా.  ఎమ్మెల్యేల ఎంపీ ల నియోజవర్గాల్లో ఎక్కడికైనా వెళ్దాం మిషన్ భగీరథ నీళ్లు రాలేదంటే దేనికైనా సిద్ధం. నీతి ఆయోగ్ నివేదికలు చదివితే తెలంగాణ, కేసీఆర్ గొప్పతనాలు తెలుస్తాయి నడ్డా. బీజేపీ సెల్లర్స్, కిల్లర్స్ పార్టీ గా మారింది. మిషన్ భగీరథ నీళ్ళతోనే నడ్డాకు స్నానం చేపిస్తాం. డి సంజయ్ కు అదే స్క్రిప్ట్ అమిత్ షా నడ్డా లకు ఒకే స్క్రిప్ట్ రాసి బీజేపీ నేతలు అభాసు పాలయ్యారు. కాళేశ్వరం ప్రాజెక్టు లో ఎలాంటి అవినీతి జరగలేదని రేవంత్ రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్రమే పార్లమెంటు లో సమాధాన మిచ్చింది. బీజేపీ దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా మాట్లాడుతుంది. కాళేశ్వరం పై అడ్డదిడ్డంగా మాట్లాడిన నడ్డాను అర్జెంటుగా ఎర్రగడ్డ ఆస్పత్రి లో చేర్చాలి. బీజేపీ ఏ టు జడ్ స్కాం ల పార్టీ. .ఇంగ్లీషు లో ఎన్ని అక్షరాలు ఉన్నాయో అన్నీ కుంభ కోణాలు చేసిన పార్టీ బీజేపీ. నడ్డా చేసిన ఆరోపణలు వెంటనే వెనక్కి తీసుకుని క్షమాపణ చెప్పాలి. .అనుచితమైన భాష మాట్లాడుతున్న ఎంపీ అరవింద్ తదితర నేతల పై పోలీసులు తక్షణమే పీడీ యాక్ట్ నమోదు చేయాలు. బండి సంజయ్ పేపర్లు చదవరు.. నడ్డా కూడా సంజయ్ కన్నా అద్వాన్నంగా అజ్ఞానం తో మాట్లాడుతున్నారు. నడ్డా నక్రాలు ఆపు... తెలంగాణ లో నిన్ను నమెందుకు బక్రాలు ఎవ్వరూ లేరు. కేసీఆర్ కుటుంబం ఉద్యమం లో పాల్గొన్నప్పుడు ఇంతమంది కుటుంబ సభ్యులు ఎందుకు పాల్గొంటున్నారు అని ఎవరైనా ఆడిగారా. బీజేపీ లో పదవుల్లో ఉన్న కుటుంబసభ్యుల చిట్టా చాలా పెద్దగా ఉంది. నడ్డా నిజాలు దాచి మాట్లాడుతున్నారు. .తెలంగాణ లో అవినీతి జరిగితే నీతి ఆయోగ్ ఎందుకు అన్ని రంగాల్లో ప్రశంసలు కురిపిస్తోంది. అరవింద్.. తప్పుడు కూతలు మానుకో. ఇక ఆట మొదలైంది. బండి సంజయ్ ఓ క్రిమినల్ .స్వాతంత్ర సమరయోధుడా...అరెస్టు చేస్తే కొవ్వొత్తుల ర్యాలీ ఎందుకు. .ఫ్రెండ్లీ పోలీసింగ్ తో బీజేపీ నేతల దుర్భషలు ఎక్కువ అవుతున్నాయి. పోలీసులు ఇక కఠినంగా వ్యవహరించాలి. నడ్డా ఇది తెలంగాణ గడ్డ.. కేసీఆర్ అడ్డా అని గ్రహించాలని అయన అన్నారు.

Related Posts