YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు తెలంగాణ

పాతబస్తిలో దారుణం బాలికతో బలవంతపు వ్యభిచారం

పాతబస్తిలో దారుణం బాలికతో బలవంతపు వ్యభిచారం

హైదరాబాద్
తెలంగాణలోని హైదరాబాద్ పాతబస్తీలో దారుణం జరిగింది. అర్ధరాత్రి ఒంటరిగా కనిపించిన బాలికపై కామాంధుల కన్ను పడింది. ఆ బాలికపై అత్యాచారం చేయడంతో పాటు మత్తు మందు ఇచ్చి వ్యభిచారం కూడా చేయించారు. హైదరాబాద్ పాతబస్తీ కిషన్ బాగ్ ప్రాంతానికి బాలిక నవంబర్ 20వ తేదీన ఇంట్లో తన అక్కతో గొడవ పడి బయటకొచ్చింది. డిసెంబర్ 1వ తేదీ బాధిత బాలిక తల్లి బహదూర్ పురా పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. బాధిత బాలిక ఆచూకీ సమాచారం మేరకు పోలీసులు ఓ ఇంటిపై దాడి చేసి బాలికను రక్షించగా.. విస్తుపోయే నిజాలు తెలిశాయి. ఆటో డ్రైవర్ అతని స్నేహితునితో కలిసి దారుణానికి పాల్పడ్డాడు. ఇంటి నుంచి బయటకు వెళ్లిన రోజు రాత్రి బాలిక రోడ్డుపై ఉండగా కొందరు యువకులు వెంబడిస్తే ఓ ఆటో డ్రైవర్ గమనించి ఆకతాయిల నుంచి రక్షించాడు. బాలిక వివరాలను ఆటో డ్రైవర్ ఆరా తీయగా ఇంటికి వెళ్లనని చెప్పడంతో ఆటో డ్రైవర్ సమీర్, అతని స్నేహితుడు హఫీజ్తో కలిసి బాధితురాలిని అత్తాపూర్ పరిధిలోని ఉప్పర్పల్లిలో ఉన్న తన ఇంటికి తీసుకెళ్లారు. ఆపై ఇద్దరూ బాలికపై అత్యాచారం చేసి మైలార్దేవ్పల్లి ప్రాంతంలో ఇద్దరు మహిళల సాయంతో ఓ ఇంట్లో ఉంచి బలవంతంగా వ్యభిచారం చేయిస్తున్నారని బహదూర్ పురా సీఐ దుర్గా ప్రసాద్ తెలిపారు. బాలికకు మత్తు మందు ఇచ్చి వ్యభిచారం చేయిస్తున్నట్లు దర్యాప్తులో వెల్లడైందని సీఐ తెలిపారు.

Related Posts