YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

కుప్పంలో చంద్రబాబు పర్యటన

కుప్పంలో చంద్రబాబు పర్యటన

కుప్పం
చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు పర్యటన ప్రారంభమైంది. బెంగళూరు నుంచి రోడ్డు మార్గాన కుప్పం సరిహద్దులోని శాంతిపురం మండలం జగరాజు పల్లి వద్ద టిడిపి కార్యకర్తలు చంద్రబాబు నాయుడు కు ఘన స్వాగతం పలికారు .మూడు రోజులపాటు నియోజవర్గంలో ఆయన పర్యటన జరగనుంది. చంద్రబాబుకు దేవరాజపురం లో టీడీపీ శ్రేణులు, అభిమానులు భారీ ఎత్తున తరలివచ్చి స్వాగతం పలికారు. చంద్రబాబు మాట్లాడుతూ మూడు రోజుల పాటు గ్రామాల్లో పర్యటిస్తా...కార్యకర్తలు, ప్రజలను కలుసుకుంటా. నేను ఎప్పుడూ కుప్పం అభివృద్ధి గురించే ఆలోచించాను. నిత్యావసరాలు తీవ్ర భారం గా మారిపోయాయి. పొరుగున ఉన్న రాష్ట్రం లో పెట్రో ధరలు 10 రూపాయలు తక్కువగా ఉంది. ఎవడబ్బ సొమ్మని ఓటీఎస్  కు 10 వేలు కట్టమని అడుగుతున్నారు.  వాలంటీర్లు బెదిరిస్తే భయపడకండి...టీడీపీ వచ్చిన తరువాత పేదల ఇళ్లకు ఉచితం గా రిజిస్ట్రేషన్. నన్ను కూడా బుతులు తిట్టే పరిస్థితి కి వచ్చారు. రౌడీయిజం చెయ్యడం ఒక్క నిమిషం పని... కానీ అది మన విధానం కాదు. కుప్పం లో టీడీపీ కార్యకర్తలను, ప్రజలను ఇబ్బంది పెడుతున్న వారి పేర్లు రాసి పెడుతున్నా ...అందరి లెక్కలు తేల్చుతామని అన్నారు.

Related Posts