YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

మానవమృగాన్ని ఉరి తీయండి

మానవమృగాన్ని ఉరి తీయండి

రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లిలోని ప్రగతి రిసార్ట్స్ లో విద్యార్థినిని శిరీష గొంతు కోసిన సాయి ప్రసాద్ ను కఠినంగా శిక్షించాలని విద్యార్థిని తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు డిమాండ్ చేశారు. వారు టెన్ టివితో మాట్లాడారు. ఇలాంటి ఘటన ఏ ఆడబిడ్డకు జరుగొద్దని పేర్కొన్నారు. రిసార్ట్స్ కు సంబంధించిన సీసీ టివి ఫుటేజ్ లను బయట పెట్టాలని డిమాండ్ చేశారు. సాయంత్రం వరకు ఇంటికి రాకపోవడంతో శిరీషకు ఫోన్ చేయగా..అందుబాటులో లేదనే సమాధానం వచ్చిందని పేర్కొన్నారు. కొన్ని సార్లు ప్రయత్నించగా శంకర్ పల్లి పోలీసులు ఫోన్ లో మాట్లాడారని, శంకర్ పల్లికి రావాలని చెప్పారు. శంకర్ పల్లి నుండి ప్రగతి రిసార్ట్స్ కు తీసుకెళ్లారని తెలిపారు. అక్కడ అమ్మాయి మృతదేహం కనిపించిందని విలపిస్తూ చెప్పారు. ఇలాంటి దారుణాలు ఇంకో బిడ్డకు జరుగొద్దని, దీనిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. శిరీష ని హత్యచేసిన మృగం సాయిప్రసాద్ ని ఎన్ కౌంటర్ చెయ్యాలి. రిసార్ట్ యాజమాన్యాన్ని అరెస్ట్ చేసి దాన్ని మూసెయ్యాలని వారు  డిమాండ్  చేసారు. 

Related Posts