YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు తెలంగాణ

కస్టమర్లను చితకబాదిన బార్ సిబ్బంది

కస్టమర్లను చితకబాదిన బార్ సిబ్బంది

రంగారెడ్డి
బోడుప్పల్ దర్బార్ బార్ లో దారుణం జరిగింది. బార్ కు వచ్చిన కస్టమర్ల పై యాజమాన్యం  విచక్షణ రహితంగా దాడి చేసింది. బార్ సిబ్బంది ముందుగా గేటు లాక్ చేసి మరీ దాడి చేసారు.  బాధితులను విడిపించేందుకు  ప్రయత్నం చేసిన కుటుంబ సభ్యుల పైన దాడి జరిపారు. ఘటనలో పలువురికి గాయాలు అయ్యయి. ఓ వ్యక్తి పరిస్థితి విషమంగా వుంది. గాయపడిన బాధితులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.  పోలీసుల ముందే బరితెగించిన దర్బార్ బార్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని బాధితుల కుటుంబాలు  ఆందోళన చేస్తున్నాయి. సదరు దర్బార్ బార్ లో వరుస సంఘటనలు జరుగుతున్నాయి. దర్బార్ బార్ పై అనేక ఫిర్యాదులు వున్నాయి. అయినా పోలీసులు  ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని బాధితులు ఆరోపిస్తున్నారు.

Related Posts