YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం

లాభాల్లో స్టాక్ మార్కెట్లు

   లాభాల్లో స్టాక్ మార్కెట్లు

కర్ణాటక అసెంబ్లీ ఫలితాలు వెల్లడికానున్న నేపథ్యంలో దేశీ స్టాక్‌ మార్కెట్లు చివర్లో జోరందుకున్నాయి. మిడ్ సెషన్‌ నుంచీ కొనుగోళ్లు ఊపందుకోవడంతో మార్కెట్లు చెప్పుకోదగ్గ లాభాలు ఆర్జించాయి. ప్రపంచ మార్కెట్ల సానుకూలతలతో తొలి నుంచీ మార్కెట్లు పటిష్టంగానే కదిలాయి. ట్రేడింగ్‌ ముగిసేసరికి సెన్సెక్స్‌ 289 పాయింట్లు జంప్‌చేసి 35,536కు చేరగా.. నిఫ్టీ 90 పాయింట్లు ఎగసి 10,806 వద్ద నిలిచింది.బీఎస్ఈ సెన్సెక్స్ సూచీలో ఏసియ‌న్ పెయింట్స్(6.17%), టాటా స్టీల్(2.17%), ఎల్ అండ్ టీ(1.69%), యెస్ బ్యాంక్(1.52%), హెఛ్‌డీఎఫ్‌సీ(1.50%), కొట‌క్ బ్యాంక్(1.46%) లాభాల‌తో ముగియ‌గా, మ‌రో వైపు భార‌తీ ఎయిర్టెల్(6.44%), స‌న్ ఫార్మా(5.05%), టాటా మోటార్స్(0.78%), హీరో మోటోకార్ప్(0.74%), ఎన్టీపీసీ(0.36%) ఎక్కువ‌గా న‌ష్ట‌పోయాయి. 

Related Posts