YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

కాంగ్రెస్ పార్టీ డిజిటల్ సభ్యత్వ నమోదు పై సమీక్ష సమావేశం

కాంగ్రెస్ పార్టీ డిజిటల్ సభ్యత్వ నమోదు పై సమీక్ష సమావేశం

రంగారెడ్డి
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం బడంగ్పేట్,మీర్పేట్ కార్పొరేషన్లకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ డిజిటల్ మెంబర్ షిపు బడంగ్పేట్ అధ్యక్షుడు పెద్ద బావి వెంకట్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చేవెళ్ల పార్లమెంట్ ఇన్చార్జ్ వేముల నరేందర్ రెడ్డి,మహేశ్వరం సభ్యత్వ ఇంచార్జి దుబ్బాక నరసింహ రెడ్డి పాల్గొన్నారు. వెంకట్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని  ప్రజల్లోకి ఏవిధంగా తీసుకెళ్లాలి అనే తదితర అంశాలపై నాయకులకు దిశానిర్దేశం చేయడం జరిగింది. చేవెళ్ల పార్లమెంట్ స్థాయి 8 అసెంబ్లీ నియోజకవర్గాలలో 8 లక్షల కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ నమోదు చేసే విధంగా నాయకులు,కార్యకర్తలు కృషి చేయాలని రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు చల్లా నర్సింహారెడ్డి అన్నారు.సభ్యత్వం తీసుకున్న ప్రతి కార్యకర్తకు రెండు లక్షల ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించడం జరుగుతుందని అన్నారు. పార్టీని పటిష్ట పరిచి 2023 ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా నాయకులు,కార్యకర్తలు పనిచేయాలని ప్రజా సమస్యలపై పోరాడాలని అన్నారు.

Related Posts