YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

సీఐడీ చీఫ్పై కేంద్రహోంశాఖ కార్యదర్శికి ఎంపీ రఘురామ కృష్ణంరాజు లేఖ

సీఐడీ చీఫ్పై కేంద్రహోంశాఖ కార్యదర్శికి ఎంపీ రఘురామ కృష్ణంరాజు లేఖ

న్యూఢిల్లీ
సీఐడీ చీఫ్ పీవీ సునీల్ కుమార్పై కేంద్రహోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లాకు ఎంపీ రఘురామ కృష్ణంరాజు లేఖ రాశారు. పీవీ సునీల్ కుమార్పై వరకట్నం వేధింపుల కింద తెలంగాణలో కేసు నమోదు  అయిందని లేఖలో తెలిపారు. భార్య పిర్యాదు మేరకు సునీల్పై తెలంగాణలో ఛార్జ్ షీట్ నమోదు చేశారని చెప్పారు. పీవీ సునీల్ కుమార్ ఈరోజు భార్య, తల్లిదండ్రులపై తప్పుడు కేసులు నమోదు చేసి అరెస్ట్  చేసే ప్రయత్నం చేశారన్నారు. పార్లమెంట్ సభ్యుడి హోదాలో రాష్ట్రంలో శాంతిభద్రతల దృష్ట్యా  వరుస ఘటనలపై విచారణ జరిపి పీవీ సునీల్ కుమార్పై చర్యలు తీసుకోవాలని, సాక్షులను ప్రభావితం  చేస్తున్నారని, వారిపై ఒత్తిడి తెస్తున్నారని ఆరోపిస్తూ లేఖ రాశారు. పీవీ సునిల్ తక్షణమే సీఐడీ చీఫ్ పోస్ట్ నుంచి బదిలీ చేయాలని ఎంపీ రఘురామకృష్ణం రాజు లేఖలో పేర్కొన్నారు. 

Related Posts