Highlights
- చెన్నై కి చెక్ పెట్టిన రాజస్థాన్
- బట్లర్ ఖాతా లో మరో అర్ధ సెంచరీ
- రాణించిన రాజస్థాన్ బౌలర్లు

ఐపీఎల్- 11 రాజస్థాన్ రాయల్స్ ఆలస్యం గా పుంజుకుంది. వరసగా రెండు విజయాలు సాదించింది. రాజస్థాన్ రాయల్స్ విజయాలలో జొస్ బట్లర్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. నిన్న జరిగిన మ్యాచ్ లో చెన్నై ఫై రాజస్థాన్ 4 వికెట్ల తేడా తో గెలిచింది. మొదట బ్యాటింగ్ కి వచ్చిన చెన్నై 4 వికెట్లు కోల్పోయి 176 పరుగులు చేసింది. చేసింగ్ కి వచ్చిన రాజస్థాన్ 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది. ఇంగ్లీష్ ఆటగాడు బట్లర్(95*) కి మ్యాన్ అఫ్ ది మ్యాచ్ లభించింది. ఈ గెలుపు తో రాజస్థాన్ రాయల్స్ ప్లే అఫ్ అసలు సజీవం చేసుకుంది.