YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

కాక రేపుతున్న పంజాబ్ పాలిటిక్స్

కాక రేపుతున్న పంజాబ్ పాలిటిక్స్

ఛండీఘడ్, జనవరి 20,
పంజాబ్‌ రాజకీయం అనూహ్య మలుపులు తిరుగుతోంది. ఎన్నికల ప్రచారంలో ఆమ్‌ఆద్మీ పార్టీ ముందు వరుసలో ఉంది. ఇప్పటికే ఆ పార్టీ చీఫ్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌ వరుసగా పంజాబ్‌లో పర్యటిస్తున్నారు. అన్నిపార్టీల కంటే ముందుగానే సీఎం అభ్యర్థిని ప్రకటించి కాలుదువ్వుతోంది ఆమ్‌ఆద్మీ. సీఎం అభ్యర్థి భగవంత్‌ మాన్‌ తన స్వగ్రామం నుంచి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ఇక.. ఆమ్‌ఆద్మీ తర్వాత.. ఆ స్థాయిలో దూసుకుపోతోంది కాంగ్రెస్‌ పార్టీ. పంజాబ్‌ పీసీసీ చీఫ్‌ నవజ్యోత్‌సింగ్‌ సిద్ధూ ప్రచార పర్వాన్ని కొత్త పుంతలు తొక్కిస్తున్నారు. ఘాటైన విమర్శలు, ప్రతిపక్షాలపై తనదైన వాగ్బాణాలు సంధిస్తున్నారు సిద్ధూ. ఈ క్రమంలో కాంగ్రెస్‌ అధిష్ఠానంపైనా ఇటీవల కీలక వ్యాఖ్యలు చేశారు. పంజాబ్‌ సీఎంను ప్రజలే నిర్ణయిస్తారన్న సిద్ధూ.. ఇందులో అధిష్ఠానం జోక్యం ఉండబోదని కుండబద్దలు కొట్టారు.కీలక పార్టీల విమర్శలు, ప్రతివిమర్శలతో పంజాబ్‌ రాజకీయం వేడెక్కగా.. మధ్యలో ఈడీ దాడులు మరింత కలకలం రేపుతున్నాయి. సీఎం చన్నీ బంధువులే కేంద్రంగా ఈడీ దాడులు నిర్వహించడం ఎన్నికల వేళ రాష్ట్రంలో అలజడి రేపుతోంది. అక్రమ ఇసుక రవాణాకు పాల్పడుతున్నారంటూ సీఎం బంధువుల ఇళ్లల్లో ఈడీ వరుసగా దాడులు చేస్తోంది. ఈరోజు కూడా సీఎం బంధువు భూపిందర్‌ సింగ్‌ ఇంట్లో దాడులు నిర్వహించిన ఈడీ.. 3.9 కోట్లను స్వాధీనం చేసుకుంది. ఈడీ రైడ్స్‌పై తీవ్ర విమర్శలు చేశారు సీఎం చన్నీ. వెస్ట్‌బెంగాల్‌ మాదిరిగానే పంజాబ్‌లోనూ కేంద్ర ప్రభుత్వం ఈడీ, ఇతర సంస్థలతో దాడులు చేయిస్తోందని ఆరోపించారు సన్నీ. రివొల్యూషన్‌ మొదలైందని.. వెస్ట్‌బెంగాల్‌ ఫలితమే పంజాబ్‌లోనూ రిపీటవుతుందని చెప్పారు.కాంగ్రెస్‌ పార్టీ ప్రధానంగా దళిత ఓటు బ్యాంకుపై దృష్టిసారించింది. సీఎం చన్నీ దళిత కమ్యూనిటీకి చెందిన వాడు కావడంతో ఆ వర్గంపై పార్టీ గంపెడాశలు పెట్టుకుంది. 2017లో 41 శాతం దళిత ఓట్లను కొల్లగొట్టింది కాంగ్రెస్‌. ఈసారి కూడా అదే పంథాలో ముందుకెళ్తోంది. ఇక.. కలిసివచ్చే పార్టీలతో జతకట్టాలని భావిస్తోంది బీజేపీ.

Related Posts