YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిపై చౌకబారు విమర్శలు మానుకోవాలి

ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిపై చౌకబారు విమర్శలు మానుకోవాలి

మెట్ పెల్లి జనవరి 22
నిరంతరం అభివృద్ధి ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిపై బిజెపి నాయకులు చేస్తున్న చౌకబారు విమర్శలు మానుకోవాలని కాంగ్రెస్ పార్టీ పట్టణ మాజీ అధ్యక్షుడు మహ్మద్ ఖుతుబొద్దిన్ పాషా అన్నారు. శనివారం స్థానిక విలేకరులతో ఆయన మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికల ముందు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ రైతులకు ఇచ్చిన హామీని వెంటనే నెరవేర్చుకోవాలని అన్నారు. అది వదిలేసి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పై నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ఇలాంటి చౌకబారు విమర్శలు చేయడం హాస్యాస్పదమన్నారు. ఇక్కడి ప్రాంత అభివృద్ధికి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఎమ్మెల్యేగా, ఎంపీగా ఎంతో అభివృద్ధి చేసి చూపారని తెలిపారు. అలాంటి ప్రజా ప్రతినిధిపై విమర్శలు చేయడం సరికాదన్నారు. ఇప్పటికైనా ఇలాంటి పనికి మాలిన విమర్శలు మానుకుని ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. పసుపు బోర్డు ఏర్పాటు చేయడంతోపాటు క్వింటాలు పసుపునకు రూ. 15 వేల మద్దతు ధరను ఇప్పించే విధంగా నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ కృషి చేయాలన్నారు. ఇప్పటికైనా ఇలాంటి చౌకబారు విమర్శలు మానుకోవాలని డిమాండ్ చేశారు.

Related Posts