YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

ఉద్యోగులకు జనసేన మద్దతు

ఉద్యోగులకు జనసేన మద్దతు

కాకినాడ
ఉద్యోగ,ఉపాధ్యాయ సంఘాలు పిఆర్సి కి వ్యతిరేకంగా చేపట్టిన ఉద్యమానికి జనసేన పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు జనసేన పార్టీ తూర్పుగొదావరి జిల్లా అధ్యక్షుడు కందుల దుర్గేష్,నాయకులు పంతం నానాజీ తెలిపారు.ప్రభుత్వం ఉద్యోగ ఉపాధ్యాయులకు 27 పర్సెంట్ ఫిట్మెంట్ మెంట్ అమలు చేయకుండా 23% అమలుచేయడం ఉద్యోగ ,ఉపాధ్యాయుల మోసం చేయడమేనన్నారు.పిఆర్సి ని తగ్గించడం వల్ల ఉద్యోగులకు జీతాలు పెరగకుండా కోత విధించారని విమర్శించారు.మాట తప్పను- మడమ తిప్పను, నేను ఉన్నాను- నేను విన్నాను అని ఉద్యోగ ఉపాధ్యాయులను నట్టేట ముంచే ప్రయత్నం ప్రభుత్వం చేస్తుందన్నారు.ఎన్నికల ముందు ప్రభుత్వ ఉద్యోగికి తోడుగా ఉంటావని, సిపిఎస్ రద్దు చేస్తామని,డిఏ లు పెంచుతామని, ఉద్యోగులు రిటైర్డ్ అయిన తర్వాత వారికి ఇళ్ల స్థలం కేటాయించి ఇళ్లు కట్టిస్తామని వాగ్దానాలు చేసి గద్దెనెక్కాక వాటిని పూర్తిగా విస్మరించారని ఆరోపించారు.అధికారంలోకి వచ్చిన అనతి కాలంలోనే అన్ని వర్గాలకు దూరం అయిన ఘనత వైసిపి జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని ఎద్దేవా చేశారు.

Related Posts