YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

ఎంఐఎం పార్టీ అధికారంలోకి వస్తే ఇద్దరు ముఖ్యమంత్రులు: ఒవైసీ

ఎంఐఎం పార్టీ అధికారంలోకి వస్తే ఇద్దరు ముఖ్యమంత్రులు: ఒవైసీ

లక్నోజనవరి 22
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తులను ఏఐఎంఐఎం ఖరారు చేసింది. బాబు సింగ్ కుష్వాహ, భారత్ ముక్తి మోర్చాతో తమ పార్టీ పొత్తు కుదుర్చుకుందని ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ శనివారంనాడు ప్రకటించారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే ప్రభుత్వంలో ఇద్దరు ముఖ్యమంత్రులు, ముగ్గురు ఉప ముఖ్యమంత్రులు ఉంటారని చెప్పారు. ముఖ్యమంత్రులలో ఒకరు ఓబీసీ వర్గానికి చెందిన వారు, మరొకరు దళిత వర్గానికి చెందిన వారు ఉంటారని తెలిపారు. ఉప ముఖ్యమంత్రుల్లో ముస్లిం వర్గానికి చెందిన వారు ఒకరు ఉంటారని వివరించారు.

Related Posts