YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

సజ్జల కాంట్రావర్శీ

సజ్జల కాంట్రావర్శీ

విజయవాడ, జనవరి 24,
ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వ్యవహారం హాట్ టాపిక్ అవుతోంది. ఆయన ఇంతకు ముందు వరకూ ప్రతి విషయాన్ని మీడియాతో చెప్పే బాధ్యత తీసుకునేవారు. చంద్రబాబుకు కౌంటర్ఇచ్చే బాధ్యత కూడా ఆయనే తీసుకునేవారు. పీఆర్సీ అంశం పూర్తిగా ఆయనే హ్యాండిల్ చేశారు. అనేక సార్లు మీడియా ముందుకు వచ్చి చెప్పారు. ఇప్పుడు పరిస్థితి ఒక్క సారిగా చేయి దాటిపోయింది. ఉద్యోగులు సమ్మెకు వెళ్ళిపోతున్నారు. కానీ ఇప్పుడు మాత్రం తెర ముందుకు సజ్జల రామకృష్ణారెడ్డి రావడం లేదు. ఇతర మంత్రుల్ని పంపి… అన్ని రకాల కామెంట్లు చేయిస్తున్నారు. ఇప్పుడు సజ్జల తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారా అన్న చర్చ జరుగుతోంది. వైసీపీలోనూ ఇదే టాపిక్ అందరి మధ్యలోనూ వస్తోంది. అధికారవర్గాల్లో జగన్ కన్నా సజ్జలకే పలుకుబడి ఎక్కువ. ఎందుకంటే ఎక్కువగా ఆయన చేతుల మీదుగానే సాగుతూ ఉంటాయి. కానీ చివరికి వచ్చే సరికి వైఫల్యం ఏమైనా ఉంటే… అది ఆయన మీదకు రాకుండా చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పుడీ ఉద్యోగుల అంశం చిన్నదిగా లేదు.. చాలా పెద్దదైపోయింది. అన్ని రకాల ఉద్యోగులు సమ్మెకు వెళ్తున్నారు. అదే జరిగితే ప్రభుత్వం తీవ్రమైన ఇబ్బందుల్లో పడినట్లే అవుతుంది. ఇప్పుడు సజ్జల జోక్యం చేసుకుని.. ఏదో ఒకటి చేయాల్సింది పోయి సైలెంటయ్యారు. ఉత్తుత్తికే వేసివట్లుగా చెబుతున్న కమిటీలో ఆయనో మెంబర్‌గా చెబుతున్నారు కానీ.. ఆ కమిటీలో ఉందో లేదో.. తెలియదని.. కేబినెట్‌లో నిర్ణయం తీసుకోలేదని పేర్ని నాని చెబుతున్నారు. మొత్తం వ్యవహారం డీల్ చేసింది సజ్జల కాబట్టి… బాధ్యత కూడా ఆయనే తీసుకోవాలన్న చర్చ కూడా వైసీపీలోనే నడుస్తోంది.
తగ్గింపుతో కొత్త జీతాలు
ఏపీ ప్రభుత్వం పీఆర్సీపై ఉద్యోగుల్ని నచ్చ చెప్పేందుకు కమిటీ వేశామని చెబుతోంది చెబుతున్నా..తమ నిర్ణయాల విషయంలో మాత్రం వెనక్కి తగ్గడం లేదు. కేబినెట్ భేటీలో పీఆర్సీకి ఆమోద ముద్ర వేసేసి.. కొత్త పే స్కేళ్లతోనే జీతాలు చెల్లించేలా మరోసారి ఉత్తర్వులు జారీ చేసింది. ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్‌ఎస్‌.రావత్‌ ఈ ఉత్తర్వులను జారీ చేశారు. 11 వ పీఆర్సీ ప్రకారం కొత్త పే స్కేళ్లతోనే జనవరి జీతాలు చెల్లించేలా బిల్లుల తయారీకి డ్రాయింగ్‌ డిస్బర్స్‌మెంట్‌, ట్రెజరీ, సీఎఫ్‌ఎంఎస్‌ అధికారులను సర్కారు ఆదేశించింది. ఉద్యోగుల సర్వీస్‌ రిజిస్టర్‌ను అనుసరించి బిల్లులను చెల్లించాలని స్పష్టం చేసింది. 2018 జులై 1 నుంచి 2021 డిసెంబర్‌ 31 వరకు సర్వీస్‌ గణించాలని ఆదేశాలు జారీ చేసింది. కొత్త సాఫ్ట్‌వేర్‌ మాడ్యూల్‌లో బిల్లులు అప్‌లోడ్‌ చేయాలని సూచించింది. 25వ తేదీగా ప్రక్రియ పూర్తి చేయాలని ఆయా శాఖలకు ప్రభుత్వం స్పష్టం చేసింది. డీడీవోలకు కొత్త పే రోల్స్‌ అందుబాటులో ఉంచాలని ప్రభుత్వం సూచించింది. అయితే ఉద్యోగులు ఎవరూ తాము ఆ పని చేసేందుకు అంగీకరించడం లేదు. తమపై ఒత్తిడి తేవొద్దని అంటున్నారు. ఉద్యోగుల ఉద్యమానికి తాము కూడా సంఘిభావం తెలుపుతున్నామని.. ట్రెజరీ.. పే అండ్ అకౌంట్స్ ఉద్యోగులు చెబుతున్నారు. ఈ కారణంగా ప్రభుత్వ ఉత్తర్వులు అమలవుతాయా.. లేదా అన్నదానిపై సస్పెన్స్ కొనసాగుతోంది.

Related Posts