YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

గులాబీ నేతల లేఖల లెక్కలు ఏంటీ

గులాబీ నేతల లేఖల లెక్కలు ఏంటీ

హైదరాబాద్, జనవరి 25,
ఫిబ్రవరి ఒకటిని పార్లమెంట్‌లో కేంద్రం బడ్జెట్ ప్రవేశ పెట్టనుంది. ఈ సందర్భంగా తెలంగాణ మంత్రి కేటీఆర్ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు వరుసగా లేఖలు రాస్తున్నారు. నిధులు కేటాయించాలని కోరుతున్నారు. కేంద్రానికి సంబంధం ఉన్న ప్రతి అంశం.. ప్రాజెక్టులోనూ సాయం ఇంత మొత్తంలో సాయం చేయాలని కోరుతున్నారు. అదే సమయంలో ప్రాజెక్టుపై ఇంత వరకూ కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకోలేది గుర్తు చేస్తున్నారు. నేషనల్‌ డిజైన్‌ సెంటర్‌ హైదరాబాద్‌ ఫార్మా సిటీ, నిమ్జ్‌ నోడ్‌లకు అవసరమైన ఆర్థిక సాయం కనీసం రూ.5 వేల కోట్లు , అలాగే వివిధ పారిశ్రామిక కారిడార్లకు మౌలిక సదుపాయాలకు నిధులు.. వంటి వాటిని నిర్మలా సీతారామన్ దృష్టికి తీసుకెళ్తున్నారు. కేటీఆర్ కేవలం.. తన శాఖకు సంబంధించిన అంశాలనే ఎక్కువగా ప్రస్తావించి లేఖలు రాస్తున్నప్పటికీ.. ఇతర శాఖల అంశాలూ అందులో అంతర్లీనంగా ఉన్నాయి. తెలుగు రాష్ట్రాలు బడ్జెట్‌లో ప్రతీ సారి ఎంతో ఆశించడం… కేంద్రం ప్రత్యేకంగా ఒక్క రూపాయి కేటాయించకపోవడం సాధారణంగా మారుతోంది. ఎన్నికలు ఉన్న రాష్ట్రాలకు ఏదో ఓ పెద్ద ప్రాజెక్టు ప్రకటిస్తారు. అదీ కూడా ఆ రాష్ట్రంలో బీజేపీ రేసులో ఉంటే మాత్రమే. లేకపోతే అదీ ఉండదు. ఈ అంశాన్ని కేటీఆర్ మరింత ఎక్కువగా ఎక్స్‌పోజ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లుగా కనిపిస్తోంది. కేటీఆర్‌కు కౌంటర్‌గా బీజేపీ నేతలు కూడా రివర్స్ వాదన ప్రారంభించే అవకాశం ఉంది. మరో వైపు . ఐపీఎస్, ఐఏఎస్ అధికారుల పోస్టింగ్‌లు భయంతో ప్రభుత్వం ఏం చేయమన్నా చేస్తున్నారు. ఏ రకమైన స్టేట్‌మెంట్లు ఇవ్వమన్నా ఇస్తున్నారు. కానీ ఇప్పుడు కేంద్రం ఆ సివిల్ సర్వీస్ అధికారులందర్నీ తన గుప్పిట్లోకి తీసుకునే ప్రయత్నం చేస్తోంది. కేడర్ రూల్స్ మార్చేస్తోంది. ఎప్పుడు కేంద్రానికి రావాలంటే అప్పుడు వచ్చేలా రూల్స్ మార్చేస్తోంది. దీన్ని బీజేపీ పాలిత ప్రభుత్వాలు ఎలాగూ వ్యతిరేకించలేవు. కానీ బీజేపీయేతర ప్రభుత్వాలు మాత్రం ఖచ్చితంగా వ్యతిరేకించి తీరాలి. ముఖ్యంగా ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్న రాష్ట్రాలు వ్యతిరేకించి తీరాలి. లేకపోతే కీలకమైన సివిల్ సర్వీస్ అధికారులు కేంద్రం గుప్పిట్లోకి వెళ్లిపోతారు. అప్పుడు చేయడానికి కూడా ఏమీ ఉండదు. అందుకే తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రధాని మోడీకి లేఖ రాశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ కేడర్ రూల్స్ మార్పును అంగీకరించబోమన్నారు. కేసీఆర్ మాత్రమే కాదు కేరళ జార్ఖండ్‌, మహారాష్ట్ర, తమిళనాడు, కేరళ, రాజస్థాన్‌, పంజాబ్‌, ఛత్తీస్‌గఢ్‌ చివరికి బిహార్‌లో బీజేపీ భాగస్వామ్య ప్రభుత్వం కూడా వ్యతిరేకిస్తోంది. కానీ ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి మాత్రం స్వాగతించాలన్న ఆలోచనలో ఉన్నారు. మొత్తం కేంద్రం గుప్పిట్లోకి తీసుకున్నా ఎందుకు స్వాగతించే ఆలోచనలో ఉన్నారో ఏపీ ప్రజలకు బాగానే తెలుసు. కానీ హక్కులన్నీ ధారాదత్తం చేసి తర్వాత తమను తాము ఎలా కాపాడుకుంటారన్నది ఎవరికీ అంతుబట్టని విషయం. కేంద్రానికి ఏ విషయంలోనూ అడ్డు చెప్పలేని దుస్థితిని ఆసరా చేసుకుని కేంద్రం కూడా ఒక్కో ఆధికారాన్ని వెనక్కి తీసుకుంటోంది. రేపు తేడా వస్తే ఏపీలో అధికారంలో ఉన్నా లేనట్లేనన్న పరిస్థితి వస్తుంది.

Related Posts