YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

గవర్నర్ తో ముగిసిన టీపీసీసీ నేతల భేటీ

గవర్నర్ తో ముగిసిన టీపీసీసీ నేతల భేటీ

హైదరాబాద్
తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళ్ సై సౌందర్ రాజన్ తో  టి- కాంగ్రేస్ బృందం భేటీ ముగిసింది. సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ * రాష్ట్రంలో శాంతిభద్రతల అంశంపై గవర్నర్ దృష్టికి తీసుకెళ్లాము.  రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ర్ వైఫల్యం చెందింది.   పోలీసులను వాళ్ళ పనులను  టీఆరెస్ నేతలు చేయనియ్యడం లేదు.  వనమా రాఘవా దాష్టికమ్- రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య, మంథని లో అద్వకేట్ హత్య, శీలం రంగయ్య ఘటనలు గుర్తు చేసాము.  శాంతిభద్రతలు పూర్తిగా దెబ్బతిన్నాయి.  పోలీస్ శాఖపై గవర్నర్ సమీక్ష చేయాలని కోరామని అన్నారు.  టీఆరెస్ ప్రభుత్వంలో పోలీస్ - పోలీస్ లాగా పనిచేయడం లేదు.  పోలీస్ నుంచి రక్షణ ఉంటది అనే భావన ప్రజలు కోల్పోయారు.  టీఆరెస్ నాయకులు చెప్తేనే పోలీస్ దగ్గర న్యాయం జరుగుతుంది.  రాజ్యాంగం ప్రకారం పోలీస్ తన విధులు తను విధించాలి. ఒత్తిళ్లకు లొంగోద్దని అయన అన్నారు.

Related Posts