YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

తెలంగాణకు అన్ని రకాలుగా మోసం

తెలంగాణకు అన్ని రకాలుగా మోసం

హైదరాబాద్, జనవరి 25,
కేసీఆర్‌ తెలంగాణను అన్ని రకాలుగా మోసం చేశారని ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా నల్గొండలోని దేవర కొండలో ఎంపీ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి మాట్లాడారు. కేసీఆర్‌ను టీఆర్‌ఎస్‌ పార్టీని ఉత్తమ్‌ కుమార్‌ తీవ్రంగా విమర్శించారు. నల్గొండ పార్లమెంట్ పరిధిలో కాంగ్రెస్ కార్యకర్తలు సైనికుల్లా పనిచేసి 100 కోట్లు ఖర్చుపెట్టిన రియల్ వ్యాపారిని ఓడించి నన్ను గెలిపించారని ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి అన్నారు. స్వాతంత్ర్యం తెచ్చిన కాంగ్రెస్‌ పార్టీకి మనం వారసులమన్నారు. ప్రపంచంలోనే భారతదేశాన్ని అగ్రగామిగా కాంగ్రెస్‌ నిలబెట్టిందన్నారు. అటు మోడీ, ఇటు కేసిర్ దేశాన్ని, రాష్ట్రాన్ని భ్రష్ఠు పట్టించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.సోనియావల్లనే తెలంగాణ వచ్చింది.. రాజకీయంగా నష్టపోయి సోనియా తెలంగాణ ఇచ్చిందని ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి అన్నారు. మతపరంగా విభజించి మోడీ, మోసాలతో కేసీఆర్‌ పరిపాలిస్తున్నారన్నారు. అన్ని రకాలుగా మోసం చేసిన కేసిర్, ఇప్పుడు దళిత బంధు అంటూ మోసం చేస్తున్నాడని ఆరోపించారు. దళితబంధుకు 1 లక్ష 70 వేల కోట్లు కావాలి, కానీ కేసీఆర్‌ 25 వేల కోట్లు మాత్రమే బడ్జెట్లో ఎందుకు పెట్టారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. కాంగ్రెస్ ఏక కాలంలో రుణమాఫీ చేస్తే, ముదనాష్టపు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం నాలుగు విడతల్లో రుణమాఫీ అంటూ రైతులను మోసం చేసిందని, టీఆర్‌ఎస్‌ రుణమాఫీ వడ్డీకి కూడా సరిపోవని ఉత్తమ్ విమర్శించారు. ఈ ప్రాంతలో పెద్ద పెద్ద మాటలు మాట్లాడిన గుత్తా, కేసీఆర్‌ కాళేశ్వరానికి అన్ని నిధులు వెచ్చించి పూర్తి చేస్తే, కేవలం 3000 కోట్లు ఎస్సెల్బీసీకి విడుదల చేయించి పూర్తి చేయలేకపోయాడని ఆగ్రహించారు. రాష్ట్రంలో ముందస్తు ఖాయమని ఉత్తమ్‌ జోస్యం చెప్పారు.

Related Posts