YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు తెలంగాణ

డ్రగ్స్ కేసులో మరో 15 మంది వ్యాపారవేత్తల గుర్తింపు

డ్రగ్స్ కేసులో మరో 15 మంది వ్యాపారవేత్తల గుర్తింపు

హైదరాబాద్ జనవరి 27
డ్రగ్స్ కేసులో మరో 15 మంది వ్యాపారవేత్తలను  టాస్క్ ఫోర్స్ పోలీసులు గుర్తించారు. పరారీలో ఉన్న వారి కోసం గాలిస్తున్నారు. టోనీ దగ్గర నుంచి వ్యాపారవేత్తలు కొన్నేళ్లుగా డ్రగ్స్‌ను కొనుగోలు చేస్తున్నారు. వందల కోట్ల డ్రగ్స్ వ్యాపారం చేసిన అంతర్జాతీయ డ్రగ్స్ స్మగ్లర్ టోనీ... లావాదేవీలన్నీ డార్క్ వెబ్ సైట్ ద్వారా నిర్వహించినట్టు పోలీసులు గుర్తించారు. టోనీ తన సెల్ ఫోన్‌లో ఉన్న డేటాను, వాట్సాప్ చాటింగ్‌లను ఎప్పటికప్పుడు డిలీట్ చేస్తున్నాడు. టోనీకి సంబంధించిన రెండు సెల్ ఫోన్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.సెల్ ఫోన్‌లో ఉన్న డేటాను, వాట్సాప్ చాటింగ్‌ను పోలీసులు రికవరీ చేశారు. టోనీ సెల్ ఫోన్‌లో మరికొంతమంది వ్యాపారులకు సంబంధాలు ఉన్నట్టు గుర్తించారు. ఇప్పటి వరకు మొత్తం 34 మందిని గుర్తించిన పోలీసులు... ఇప్పటికే 9 మందిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. టోనీతో పాటు 9 మంది నిందితులను 7 రోజుల పాటు కస్టడీకి పోలీసులు కోరారు. దీనిపై కోర్టులో వాదనలు పూర్తి అయ్యాయి. గురువారం కస్టడీపై తీర్పు వచ్చే అవకాశముంది. నిందితులను కస్టడీకి తీసుకుని విచారిస్తే మరింత సమాచారం వస్తుందని పోలీసులు చెబుతున్నారు.

Related Posts