YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ముద్రగడ పై చినరాజప్ప ఫైర్

ముద్రగడ పై చినరాజప్ప ఫైర్

కాపులకు న్యాయం చేసేవాళ్ళనే ముద్రగడ నిందిస్తున్నారు. కాపుల రిజర్వేషన్లు బిల్లు ను కేంద్రానికి పంపిందే చంద్రబాబని డిప్యూటీ సీఎం, హోం మంత్రి చినరాజప్ప అన్నారు. శనివారం నాడు అయన మీడియాతో మాట్లాడుతే ముద్రగడపై మండిపడ్డారు. కాపు రిజర్వేషన్లు కోసం కేంద్రానికి లేఖ రాయకుండా, చంద్రబాబు పై సిబిఐ వేయాలని లేఖరాయడం ముద్రగడ కు తగదని అన్నారు. ముద్రగడ కాపు ఉద్యమానికి గతంలోకోట్ల విజయభాస్కరరెడ్డి మూడు కోట్లు విడుదల చేస్తానంటేనే సన్మానాలు చేశారు. చంద్రబాబు కాపులకు కార్పొరేషన్ పెట్టి మూడువేల కోట్లు రుణాలు ఇస్తుంటే ,,నిత్యం లేఖలతో విమర్శలు చేస్తావా అని నిలదీసారు. కాపులకు న్యాయం చేసేది చంద్రబాబే. కాపుల రిజర్వేషన్లు బిల్లు అంశం ప్రస్తుతం కేంద్ర పరిధిలో వుంది..కేంద్రంపై పోరాటంలో ఆ అంశం కూడా వుందని అయన అన్నారు. 

Related Posts