ఒంగోలు విద్యాశాఖకు చెందిన ఉద్యోగి జ్ఞానేశ్వర్ లంచం తీసుకుంటూ ఏసీబీ అదికారులకు పట్టుబడ్డారు. గంటాపాలెంలోని ఒంగోలు ఉప విద్యాధికారి కార్యాలయంలో క్యాంప్ క్లర్కుగా పనిచేసే బొద్దిపాటి జ్ఞానేశ్వర్ ఒక పాఠశాల నిర్వాహకుడి నుంచి ఐదు వేల రూపాయలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు దాడి చేసి రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. హరిబాబు అనే వ్యక్తి ఒంగోలు వెంకటేశ్వర కాలనీలో చైతన్య స్కూల్ కి చెందిన అనుమతుల విషయంలో తనకు 30 వేలు ఇవ్వాలని జ్ఞానేశ్వర్ డిమాండ్ చేశాడు. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులకు సమాచారం అందించడంతో జ్ఞానేశ్వర్ను అక్కడే ఉన్న అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు.