YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

టీడీపీకి ఇంగిత జ్ఞానం లేదు.. క్యాసినోపై బైడెన్‌కు ఫిర్యాదు చేస్తారేమో?: కొడాలి నాని

టీడీపీకి ఇంగిత జ్ఞానం లేదు.. క్యాసినోపై బైడెన్‌కు ఫిర్యాదు చేస్తారేమో?: కొడాలి నాని

విజయవాడ, జనవరి 29,
టీడీపీ, ఆ పార్టీ అధినేత చంద్రబాబుపై మరోసారి మంత్రి కొడాలి నాని తీవ్ర విమర్శలు చేశారు. గుడివాడలో ఎన్టీఆర్ విగ్రహానికి పాలాభిషేకం చేసిన మంత్రి కొడాలి నాని అనంతరం మీడియాతో మాట్లాడారు. రాజకీయాలకు అతీతంగా కృష్ణా జిల్లాలో కొత్తగా ఏర్పాటు చేసే జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెడితే అభినందించాల్సింది పోయి ఇంగిత జ్ఞానం లేకుండా టీడీపీ నేతలు విమర్శలు చేస్తున్నారని మంత్రి కొడాలి నాని మండిపడ్డారు. టీడీపీ ఓ దిక్కుమాలిన పార్టీ అని… డబ్బా పార్టీ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.2014 నుంచి 2019 వరకు చంద్రబాబు చేసిందేమీ లేకపోయినా ఆయన డబ్బా మీడియా వివిధ రకాలుగా ప్రచారం చేసినా ప్రజలు అవేవీ నమ్మకుండా టీడీపీకి తగిన బుద్ధి చెప్పారని మంత్రి కొడాలి నాని విమర్శించారు. రాజకీయ పరంగా ఎన్టీఆర్, వైఎస్ఆర్‌ మధ్య వైరం ఉన్నా తమ సీఎం జగన్ అవేమీ పట్టించుకోకుండా తెలుగు ప్రజల కోసం ఎన్నో సేవలు చేసిన ఎన్టీఆర్‌ను స్మరించుకునేందుకు కొత్త జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టారని వివరించారు. వైఎస్ఆర్ ఆశయాలనే కాకుండా ఎన్టీఆర్ చేసిన సేవలను జగన్ ఆదర్శంగా తీసుకుని పాలన సాగిస్తున్నారని తెలిపారు. వైఎస్ఆర్, ఎన్టీఆర్‌లనే కాకుండా అంబేద్కర్, జగ్జీవన్‌రామ్, వంగవీటి రంగా వంటి ఎందరో ప్రముఖుల బాటలో జగన్ నడుస్తున్నారన్నారు.అటు గుడివాడలో మూడు రోజులు క్యాసినో జరిగితే.. 362 రోజులు టీడీపీ చీర్ బాయ్స్ ప్రచారం చేస్తున్నారని మంత్రి కొడాలి నాని విమర్శించారు. టీడీపీ నేతలకు జీవితకాలం టైం ఇస్తున్నానని… వారికి చేతనైంది చేసుకోవాలని సవాల్ విసిరారు. మూడు రోజుల క్యాసినోకు రూ.500 కోట్లు వస్తే మరి 50 క్యాసినోలు ఉన్న గోవాలో ఎన్ని వేల కోట్లు రావాలని కొడాలి నాని ప్రశ్నించారు. టీడీపీ వాళ్లు ఈ వ్యవహారంపై త్వరలో అమెరికా అధ్యక్షుడు బైడెన్‌కు కూడా ఫిర్యాదు చేస్తారేమో అంటూ ఎద్దేవా చేశారు.

Related Posts