YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

జీతాలు ఎలా...

జీతాలు ఎలా...

విజయవాడ, జనవరి 31,
ఏపీలో పీఆర్సీ వ్యవహారంలో చిక్కుముడులు వీడకపోవడంతో జనవరి నెల జీతాల పరిస్థితిపై ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికీ ప్రాసెస్‌ కాని జీతాలు, పెన్షన్ల బిల్లులను ప్రాసెస్‌ చేసే బాధ్యతను డీడీఓలకంటే పైస్థాయి అధికారులకు అప్పగించారు. ఎలాగైనా జీతాల ప్రక్రియ పూర్తిచేయాలని ఆదేశాలు రావడంతో అధికారులు తలలు పట్టుకుంటున్నారు.ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు వివిధ జిల్లాల కలెక్టర్లు. జీతాల బిల్లులు ప్రాసెస్‌ కాకుంటే ప్రత్యామ్నాయాలు చూడాలన్న ప్రభుత్వం ఆదేశాల మేరకు డీడీఓలకంటే పై స్థాయి అధికారులకు బాధ్యతల అప్పగించారు. సర్వీస్‌ రిజిస్టర్‌ అందుబాటులో లేని కారణంగా జీతాల బిల్లులను చెల్లింపులు చేయలేమని అశక్తతను వ్యక్తం చేస్తూ కొన్ని జిల్లాల్లో ట్రెజరీ అధికారులకు లేఖలు రాశారు ఉన్నతాధికారులు.కొత్త పీఆర్సీ ప్రకారం జీతాలు వద్దంటూ చాలా మంది ఉద్యోగులు రిక్వెస్ట్‌ లెటర్లు పెడుతున్నారన్న విషయాన్ని లేఖల్లో స్పష్టం చేస్తోన్న అధికారులు. కొన్ని చోట్ల ఆదివారం పూట కూడా కార్యాలయాలకు వచ్చి బిల్లులను ప్రాసెస్‌ చేశారు ఉద్యోగులు. ప్రాసెస్‌ కాని బిల్లుల విషయంలో అధికారాలను బదలాయిస్తూ ఉత్తర్వులిచ్చారు కలెక్టర్లు. ఈ నెల జీతాలు ఎలా వస్తాయోనని ఉద్యోగులు చూస్తున్నారు.

Related Posts