YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు

ఫేక్ ఫేస్ బుక్ అకౌంట్లున్నాయి మాణిక్యాలరావుపై ముళ్లపడి బాపిరాజు ఫైర్

ఫేక్ ఫేస్ బుక్ అకౌంట్లున్నాయి  మాణిక్యాలరావుపై ముళ్లపడి బాపిరాజు ఫైర్

బీజేపీ ఎమ్మెల్యే మాణిక్యాలరావు పై జడ్పీ ఛైర్మన్ ముళ్ళపూడి బాపిరాజు మండిపడ్డారు. రాష్ట్రంలో ఏం గొడవలు జరిగాయని రాష్ట్రపతి పాలన పెట్టాలి. రాష్ట్రపతి పాలన పెట్టేంత దమ్ము బీజేపీ కి ఉంటే ఎలాంటి బుద్ధి చెప్పాలో మాకు తెలుసని అన్నారు. బీజేపీ నేతలు దొంగ ఫేస్ బుక్ ఎకౌంట్ లతో టీడీపీ పై దుష్ప్రచారం చేస్తున్నారు. బీజేపీ మాజీమంత్రి మాణిక్యాలరావు ఆఫీస్ కు చెందిన వ్యక్తులే ఈ ఫేక్ ఫేస్ బుక్ లో పోస్ట్ లు చేస్తున్నారని పోలీసులు గుర్తించారని అన్నారు. దమ్ముంటే రాబోయే ఎన్నికల్లో మాణిక్యాలరావు బీజేపీ నుండి పోటీచేసి కనీసం డిపాజిట్లు అయినా సాధించి చూపించమని అన్నారు. తాడేపల్లిగూడెం లో ఒక్కరూపాయి అవినీతి చేశారని నిరూపిస్తే నేను కూడా జడ్పీ ఛైర్మన్ పదవికి రాజీనామా చేస్తా. బ్రోకర్ తో కోటి రూపాయలు కమీషన్ కోసం డిమాండ్ చేసిన అవినీతి మాణిక్యాలరావుదని అన్నారు. నిట్, నీరు చెట్టు, కెనాల్ వర్క్ అన్నింటిలో రామకృష్ణ రెడ్డి అనే బ్రోకర్ తో కమీషన్ డిమాండ్ చేసిన ఆధారాలున్నాయి. బీజేపీ మాణిక్యాలరావు టీడీపీ కి కనీస పోటీ కూడా ఇవ్వలేరు. బీజేపీ వచ్చే ఎన్నికల్లో నాలుగైదు స్థానంలో ఉంటుందని అన్నారు.

జిల్లాలో టీడీపీ లో ఒకరిద్దరు వైసీపీ లో చేరినా నష్టం లేదు. నమ్మకద్రోహులు, అసంతృప్తులు వెళ్లినా తెదేపాకు నష్టం ఉండదు. ఎన్ని వలసలు వచ్చినా వైసీపీ కి అధికారం రావడం కల అని అయన అన్నారు.

Related Posts