YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

బీజేపీ శత్రువు

 బీజేపీ శత్రువు

హైదరాబాద్, జనవరి 31,
బండి సంజయ్‌ నీ మిలియన్‌ మార్చ్‌ మోడీ దగ్గర చేయి మాదగ్గర కాదు అంటూ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి బండి సంజయ్‌ పై విరుచుకుపడ్డారు. ఈ సందర్భంగా ప్రశాంత్‌ రెడ్డి సోమవారం మీడియాతో మాట్లాడుతూ… కేంద్రప్రభుత్వాన్ని, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌పై మాటల దాడికి దిగారు. కేంద్రంలో బీజేపీ తెలంగాణ పాలిట శ్రతువుగా మారిందని మంత్రి పేర్కొన్నారు. ఏడాదికి 2కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్న బీజేపీ ఉద్యోగాల కల్పనపై శ్వేత పత్రం విడుదల చేయాలన్నారు. తెలంగాణలో కేసీఆర్ సర్కార్ ఇచ్చినన్ని ఉద్యోగాలు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎందుకు ఇవ్వలేదని మంత్రి ప్రశాంత్‌ రెడ్డి ప్రశ్నించారు.నా రాజీనామా సవాల్‌కు కట్టుబడి ఉన్న బండి సంజయ్‌ నిరూపిస్తావా..? నీవు సిద్ధమా అంటూ వేముల సవాల్‌ విసిరిరారు. అరవింద్‌ పసుపు బోర్డు పేరుతో రైతులను మోసం చేశారని అందుకే రైతులు తిరగబడుతున్నారని మంత్రి అన్నారు. బీజేపీ వల్ల రాష్ట్రానికి ఏ ఒక్క రూపాయి అదనంగా రాలేదని చెప్పారు. పెద్దమనిషి కేసీఆర్‌ను ఆయన పిల్లలు కేటీఆర్‌, కవితలను తిడుతూ ఆయన పిల్లలు కేటీఆర్‌ కవితలను తిడుతూ రాజకీయ పబ్బం గడుపుతున్నారన్నారు. నోటికొచ్చినట్లు మాట్లాడితే టీఆర్ఎస్ కార్యకర్తలు చూస్తూ ఊరుకోరని హెచ్చరించారు. బాల్కొండ అభివృద్ధిపై విమర్శించే వారంతా రాజకీయంగా అడ్రస్‌ లేనివారని మంత్రి ఎద్దేవా చేశారు. మీరు ఎన్ని కుట్రలు చేసిన, రాజకీయాలు చేసిన బాల్కొండ అభివృధ్ది ఆగదని మంత్రి వేములప్రశాంత్‌రెడ్డి పునరుద్ఘాటించారు.

Related Posts