YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

మోడీ కోటి దాటేశారు

మోడీ కోటి దాటేశారు

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 1
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సోషల్ మీడియాలో దూసుకెళ్తున్నారు. సెలబ్రిటీలతో పోటీ పడుతున్నాడు. తగ్గేదే లేదంటూ ముందుకెళ్తున్నారు. యూట్యూబ్లో అత్యధిక సబ్‌స్క్రైబర్లతో దూసుకుపోతున్నారు. నరేంద్ర మోడీ యూట్యూబ్ ఛానల్ సబ్‌స్క్రైబర్ల సంఖ్య కోటి దాటింది.ఇతర దేశాధి నేతలకు ఇంత ఫాలోయింగ్ లేదు. బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బల్సోనరో 36 లక్షల సబ్‌స్క్రైబర్లు, మెక్సికో అధినేత ఆండ్రెస్ మాన్యువల్ లోపెజ్ ఒబ్రాడోర్ 30.7 లక్షలు, ఇండోనేషియా అధ్యక్షుడు జోకో విడోడో 28 లక్షలు, జో బైడెన్ 19 లక్షలు, వైట్ హౌస్ 19 లక్షల యూట్యూబ్ సబ్‌స్క్రైబర్లను కలిగి ఉందిదేశంలో చూసుకుంటే.. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ 5.25 లక్షలు, శశిధరూర్ 4.39 లక్షల మంది, అసదుద్దీన్ ఓవైసీ 3.73 లక్షల మంది, స్టాలిన్ 2.12 లక్షల సబ్‌స్క్రైబర్లు, మనీశ్ సిసోడియా 1.3 లక్షల సబ్‌స్క్రైబర్లను కలిగి ఉన్నాడు. నరేంద్ర మోడీ ట్విట్టర్ ఫాలోవర్స్‌లో కూడా ముందు ఉన్నాడు. ప్రస్తుతం మోడీకి ట్విట్టర్‌లో 75. 3 మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారు.

Related Posts