YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

తగ్గిన గ్యాస్ సిలెండర్

తగ్గిన గ్యాస్ సిలెండర్

హైదరాబాద్, ఫిబ్రవరి 1,
సామాన్యులకు ఫిబ్రవరి 1న గుడ్ న్యూస్ అందింది. ఎల్పీజీ సిలిండర్ ధరలు భారీగా తగ్గాయి. దీంతో సామాన్యులకు గ్యాస్ ధరలలో ఊరటనిచ్చింది. చమురు కంపెనీలు వాణిజ్య గ్యాస్ సిలండర్ రేట్లను తగ్గించాయి. ఫిబ్రవరి నెలారంభంలో సామాన్యులకు శుభవార్త అందించాయి చమురు సంస్థలు. అయితే ఈ ప్రయోజనం కేవలం కొంత మందికి మాత్రమే వర్తిస్తుంది. కంపెనీలు కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరను మాత్రమే తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నాయి. దీంతో కొందరికి మాత్రమే ఈ ధరలు వర్తించనున్నాయి.చమురు సంస్థలు 14.2 కేజీల సిలిండర్ ధరను మార్చలేదు. దీంతో ఎల్పీజీ సిలిండర్ల ధరలో ఎలాంటి మార్పు లేదు. దీనివలన వీరికి ఎలాంటి ఊరట లేదు. ఇక ఇండియన్ ఆయి 19 కిలోల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరను రూ. 91.5 తగ్గించింది. ధర తగ్గించిన తర్వాత ఢిల్లీలో 19 కిలోల గ్యాస్ సిలిండర్ ధర రూ. 1907గా చేరింది. ఈనెలలో గ్యాస్ ధరలు పెరగలేదు. చమురు సంస్థలు ఫిబ్రవరి నెల దేశీయ గ్యాస్ ధరలను విడుదల చేయగా.. అందులో సబ్సిడీయేతర సిలిండర్ ధర పెరగలేదు.ఇక ఈరోజు విడుదలైన గ్యాస్ ధరల ఆధారంగా కోల్ కత్తాలో సిలిండర్ రూ. 1987కు తగ్గింది. దీంతో ధర రూ. 89 దిగివచ్చింది. గతంలో దీని రేటు రూ. 2076 వద్ద ఉండేది. ఇక ముంబైలో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర రూ. 91.5 తగ్గి.. రూ. 1948 నుంచి రూ. 1857కు చేరుకుంది. ఇక చెన్నైలో అయితే ఈ సిలిండర్ ధర రూ. 50.5 మాత్రమే తగ్గింది. దీంతో సిలిండర్ ధర రూ. 2080కు చేరింది. ఇక తెలుగు రాష్ట్రాల్లో 14.2 కేజీల సిలిండర్ ధర దాదాపు రూ. 960 వద్ద కొనసాగుతుంది.ఇక ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరను తనిఖీ చేయడానికి మీరు చమురు సంస్థల అధికారిక వెబ్ సైట్ సందర్శించాల్సి ఉంటుంది. ప్రతి నెల మార్పులు జరిగే కొత్త ధరలను https://iocl.com/Products/IndaneGas.aspx పై క్లిక్ చేసి మీ నగరంలో ఉన్న గ్యాస్ సిలిండర్ ధరలను చెక్ చేసుకోవచ్చు. ఇండియన్ ఆయిల్ తన వినియోగదారుల కోసం కొత్త రకం ఎల్పీజీ సిలిండర్ ను విడదల చేసింది. దీని పేరు కాంపోజిట్ సిలిండర్. ఈ సిలిండర్ మూడు అంచెల్లో నిర్మించారు. లోపలి నుంచి మొదటి స్తాయి అధిక సాంద్రత కలిగిన పాలిథిన్ తో తయారు చేయబడుతుంది. లోపలి పొర పాలిమర్ తో చేసిన ఫైబర్ గ్లాస్ తో పూత పూయబడుతుంది. ఇక బయటి పొర హెడ్పీఈతో తయారు చేస్తారు.

ఆదాయం పన్నుపై నిరాశ
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ రోజు 2022-23 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర బడ్జెట్‌ను సమర్పించారు . మోదీ ప్రభుత్వానికి ఇది నాలుగో బడ్జెట్‌. ఈ బడ్జెట్‌ను కరోనా వైరస్‌ మహమ్మారి కాలంలో సమర్పించారు. అందువల్ల, దాని ప్రాముఖ్యత పెరుగుతుంది. ఆర్థిక మంత్రి సీతారామన్‌కి ఇది నాలుగో బడ్జెట్‌.ఐటీ రిటర్న్‌ల దాఖలు చేసేవారికి కేంద్ర సర్కార్‌ గుడ్‌న్యూస్‌ తెలిపారు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌. ఆదాయపు పన్ను చెల్లింపుల్లో సవరణలకు రెండేళ్లలో అప్‌డేట్‌ చేసుకునే వెలుసుబాటు కల్పించారు. రిటర్న్‌లు సమర్పించిన తర్వాత రెండేళ్లలో సవరణ చేసుకోవచ్చు. ఇక కోటి కుటుంబాలకు ఉజ్వల పథకం విర్తించనున్నట్లు తెలిపారు. సహకార సంఘాలపై సర్‌ఛార్జీని తగ్గిస్తున్నట్లు మంత్రి నిర్మల సీతారామన్‌ ప్రకటించారు.కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా రాష్ట్ర ఉద్యోగులకు నేషనల్‌ పెన్షన్‌ స్కీమ్‌ (NPS) డిడక్షన్‌ ఉంటుందని మంత్రి వివరించారు. ఉద్యోగులకు ఎన్‌పీఎస్‌ మినహాయింపు 14 శాతం పెంచుకునే అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు.
ఇక ఆదాయపు పన్ను మినహాయింపుపై ఈ సారి నిరాశ కలిగించింది. వేతన జీవులకు ఊరట కల్పించే ఏ నిర్ణయాన్ని మంత్రి ఈ బడ్జెట్‌లో ప్రకటించకపోవడంతో కొంత నిరాశ వ్యక్తం అవుతోంది. ఆదాయపు పన్ను మినహాయింపులపై ఎన్నో ఆశలు పెట్టుకున్న ఉద్యోగులకు నిరాశే పెరిగింది.

Related Posts