ఖమ్మం జిల్లా బోనకల్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన రైతుబంధు పాసుపుస్తకాలు ,చెక్కుల పంపిణీ సభలో రగడ చెలరేగింది. అధికారులు ఏర్పాటు చేసిన సభలో టీఆర్ఎస్ నాయకులు కౌంటర్లు ఏర్పాటు చేయండం, రెవిన్యూ అధికారులు ఇవ్వవలసిన రెవిన్యూ స్లిప్పులను టీఆర్ఎస్ నాయకులు ఇవ్వడంతో వివాదం రేగింది. బోనకల్ జడ్పీటిసి బానోతు కొండ రెవిన్యూ అధికారులు చేయవలసిన పనిని టీఆర్ఎస్ నాయకులు చేయడం ఏంటని తహశీల్దార్ కు పిర్యాదు చేశారు . దీంతో ఆగ్రహించిన టీఆర్ఎస్ నాయకులు జడ్పీటిసి బానోతు కొండ పై ,అధికారులపై రెచ్చిపోయి మాట్లాడారు. దీంతో సభలో కొద్దిసేపు ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది . ఇంతలో ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాస రెడ్డి రావడంతో జడ్పీటిసి ఎంపీ కి పిర్యాదు చేసి నిరసన వ్యక్తం చేశారు . ఎంపీ శ్రీనివాస రెడ్డి టీఆర్ఎస్ నాయకులు చేసింది తప్పేనని జడ్పీటిసికి సర్ది చెప్పడంతో గొడవ సర్దుకుంది .