YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ఐసెట్ ఫలితాలు విడుదల

ఐసెట్ ఫలితాలు విడుదల

ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన ఏపీ ఐసెట్‌-2018 పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. విజయవాడలో మావవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు శనివారం  మధ్యాహ్నం ఫలితాలను విడుదల చేశారు. గుంటూరు జిల్లాకు చెందిన ప్రసన్న పవన్‌ కుమార్‌ ఐసెట్ స్టేట్ టాపర్‌గా నిలిచాడు. వెంకట నరసుగారి భరత్‌కుమార్‌ (అనంతపురం), నుసుమ్‌ సాయికుమార్‌ రెడ్డి (అనంతపురం) వరసగా రెండో, మూడో ర్యాంక్ సాధించారు. ఐసెట్‌లో ఈసారి 92.60 శాతం ఉత్తీర్ణత నమోదైనట్లు మంత్రి గంటా తెలిపారు.జూన్‌ 20 నుంచి ఐసెట్‌ 2018 కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నట్లు మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. శ్రీవెంకటేశ్వర విశ్వవిద్యాలయం ఈ పరీక్ష నిర్వహించింది.

ఏపీ ఐసెట్ 2018 టాప్‌ టెన్ ర్యాంకర్లు

1. చింతగుంట్ల ప్రసన్న పవన్‌కుమార్‌ (గుంటూరు)

2. విఎన్ భరత్‌కుమార్‌ (అనంతపురం)

3. ఎన్ సాయికుమార్‌ రెడ్డి(అనంతపురం)

4. హర్షవర్ధన్‌ (అనంతపురం)

5. ఎస్ శ్రీహర్షవర్ధన్‌ (కృష్ణా)

6. బొర్రా శ్రీదీప్తి (శ్రీకాకుళం)

7. కాకాని వాసు కృష్ణకుమార్‌ (విశాఖపట్నం)

8. కూన వెంకటలక్ష్మీ నారాయణరావు (విశాఖపట్నం)

9. డి వెంటసాయి మనోజ్‌బాబు (శ్రీకాకుళం)

10. ఒ భానుప్రకాశ్‌ (చిత్తూరు)

Related Posts