YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

త్వరలో మేడ్చల్ మండలంలో 50 పడకల ఆసుపత్రి మంత్రి హరీష్ రావు

త్వరలో మేడ్చల్ మండలంలో 50 పడకల ఆసుపత్రి మంత్రి హరీష్ రావు

మేడ్చల్
మేడ్చల్ లో ఓ ప్రైవేటు ఆసుపత్రిని మంత్రి హరీశ్ రావు గురువారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రిమల్లారెడ్డి కుడా పాల్గోన్నారు.  ఈ సందర్బంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ మంత్రి మల్లారెడ్డి కోరిక మేరకు మార్చి నెల తరువాత మేడ్చల్ మండలంలో రూ. 10 కోట్లతో మరో 50 పడకల ఎం సి హెచ్ ఆసుపత్రిని మంజూరు చేసి పనులు ప్రారంభిస్తాం.  దీనికి అనుబంధంగా మరో కోటి రూపాయలతో ఎస్ ఎన్ సీ యు కేంద్రాన్ని ప్రారంభిస్తాం. ముఖ్యమంత్రి కేసీఅర్ ప్రారంభించిన కేసీఅర్ కిట్ పథకం దేశానికే ఆదర్శంగా నిలిచింది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలు 30 శాతం నుండి 52 శాతానికి పెరిగాయి. దీన్ని మరింత పెంచడంలో లక్ష్యంగా రాష్ట్రంలో అవసరం ఉన్న ప్రాంతాల్లో ఎం సి హెచ్, ఎస్ ఎన్ సి యూ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని అన్నారు.

Related Posts