YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

అమిత్ షా కాన్వాయ్ పై రాళ్లదాడి జరగలేదు డీజీపీ మాలకొండయ్య

అమిత్ షా కాన్వాయ్ పై రాళ్లదాడి జరగలేదు              డీజీపీ మాలకొండయ్య

జేపీ అధ్యక్షుడు అమిత్ షా కాన్వాయ్ పై ఎలాంటి రాళ్ల దాడి జరగలేదని ఏపీ డీజీపీ మాలకొండయ్య స్పష్టం చేశారు. కాన్వాయ్ లోని ఏడో కారు అలిపిరి వద్ద కొద్దిగా స్లోగా వెళ్లిందని... ఈలోగా సుబ్రహ్మణ్యం అనే వక్తి కర్రతో కారు అద్దం పగలగొట్టారని చెప్పారు. ఘటన జరిగిన వెంటనే ట్రాఫిక్ పోలీసులు అతన్ని పట్టుకున్నారని చెప్పారు.ఈ ఘటనపై కేసు నమోదు చేశామని, ఒకర్ని అరెస్ట్ చేశామని తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి ఇరు వర్గాల నుంచి ఫిర్యాదులు అందాయని చెప్పారు. తప్పు ఎవరు చేసినా చర్యలు తీసుకుంటామని... పోలీసు సిబ్బంది తప్పుందని తేలినా చర్యలు తప్పవని తెలిపారు. అలిపిరి ఘటనపై బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు డీజీపీకి ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ డీజీపీ ఈ మేరకు స్పందించారు.

Related Posts