YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ దేశీయం

సింగరేణి జోలికి వస్తే కార్మికుల సెగ ఢిల్లీకి తాకుతుంది. కేంద్రానికి మంత్రి కేటీఆర్ వార్నింగ్‌!

సింగరేణి జోలికి వస్తే కార్మికుల సెగ ఢిల్లీకి తాకుతుంది. కేంద్రానికి మంత్రి కేటీఆర్ వార్నింగ్‌!

హైదరాబాద్  ఫిబ్రవరి 7
 సింగరేణి విషయంలో కేంద్రం పై యుద్ధాన్ని ప్రకటించింది తెలంగాణ సర్కార్. కేంద్ర గనులశాఖ మంత్రికి కేటీఆర్‌ ఘాటు లేఖ రాశారు. తెలంగాణలో నాలుగు బొగ్గు గనుల వేలం ఆపాలన్నారు‌. ఈ గనులను వేలం లేకుండా సింగరేణికి కేటాయించాలని రాష్ట్ర మంత్రి కేటీ రామారావు డిమాండ్ చేశారు. సింగరేణి ప్రైవేటీకరణకు కేంద్రంలోని బీజేపీ కుట్ర పన్నుతోందని కేటీఆర్‌ మండిపడ్డారు. సింగరేణి నల్లబంగారం యావత్ తెలంగాణకే కొంగుబంగారమన్నారు. సింగరేణిని దెబ్బతీస్తే కేంద్రంలోని బీజేపీ కోలుకోని విధంగా దెబ్బతినడం ఖాయమని.. సింగరేణి జోలికి వస్తే కార్మికుల సెగ ఢిల్లీకి తాకుతుందని వార్నింగ్‌ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఏడేళ్ల కాలంలో అభివృద్ధిలో అద్భుత ఫలితాలు సాధిస్తోందన్నారు. ఇలాంటి సంస్థను ఉద్దేశ్యపూర్వకంగా చంపే కుట్ర బీజేపీ చేస్తోందన్నారు మంత్రి కేటీఆర్‌.అసలు సింగరేణిని బలహీనపరిచాలన్నదే కేంద్రం కుట్రగా భావిస్తున్నామన్నారు. బ్లాకులు వేరే సంస్థలకు కేటాయించడం ద్వారా నష్ట పూరిత పబ్లిక్ సెక్టార్ కంపెనీగా మార్చేందుకు ప్రయత్నాలు చేస్తోందన్నారు. అంతిమంగా ప్రైవేటుపరం చేసే కుటిల ప్రయత్నాల్లో కేంద్రంముందని విమర్శలు చేశారు. సింగరేణి అంటే కోల్ మైన్ మాత్రమే కాదు.. యువతకు ఉపాది కల్పించే గోల్డ్ మైన్ అన్నారు. తెలంగాణ వచ్చాక 16 వేలకు పైగా ఉద్యోగాలు ఇచ్చామన్నారు.సింగరేణిని ప్రైవేటకరిస్తే వారసత్వ ఉద్యోగాలు దొరకవని.. గనులు మూతపడిన కొద్దీ కార్మికులను ఉద్యోగాల నుంచి తొలగిస్తారన్నారు కేటీఆర్‌. కార్మికులకు అందుతున్న హక్కులు, లాభాల్లో వాటాలుండవన్నారు. సింగరేణి సంస్థ సమీప భవిష్యత్తులో కనుమరుగైపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. సింగరేణిని కాపాడుకునేందుకు కార్మికులకు అండగా ఉంటామన్నారు.విశాఖ ఉక్కు కర్మాగారాన్ని బలహీనపరిచి ప్రైవేటీకరణ చేసినట్లే.. సింగరేణిని చేయాలని చూస్తున్నారని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే బాల్కసుమన్‌ మండిపడ్డారు. అందుకే కేంద్ర గనుల శాఖామంత్రి ప్రహ్లాద్‌ జోషికి మంత్రి కేటీఆర్‌ లేఖ రాశారన్నారు. గనుల బ్లాకుల వేలంతో సింరేణిని చావుదెబ్బ తీయాలని కేంద్రం చూస్తోందన్నారు. అదే జరిగితే సింగరేణి సెగ ఢిల్లీకి తాకుతుందన్నారు సుమన్‌. మరోవైపు, ఈనెల 9 నుంచి సింగరేణి వ్యాప్తంగా నిరసన దీక్షలు చేపట్టబోతున్నాయి టీఆర్ఎస్ శ్రేణులు, TBGKS కార్మిక నాయకులు. అన్ని సంఘాలు కదిలిరావాలని పిలుపునిచ్చారు. నాలుగు బొగ్గు గనులను ప్రైవేటీకరణ కాకుండా కాపాడుకోవడమే ధ్యేయంగా ఆందోళనలు చేపడుతున్నారు. ఇప్పటికే 40 వేల సంతకాలను సేకరించింది టీబీజీకేఎస్. ఈ సంతకాల సేకరణను  కోల్ మినిస్ట్రీకి పంపనున్నారు.

Related Posts