YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

సిసిఐని పునరుద్దారించాలి ఎమ్మెల్యే జోగు రామన్న

సిసిఐని పునరుద్దారించాలి ఎమ్మెల్యే జోగు రామన్న

ఆదిలాబాద్
మూతపడ్డ సిసిఐ సిమెంట్ ఫ్యాక్టరీ పునరుద్ధరించాలని కోరుతూ సామాజిక మాధ్యమం లో ప్రచారం చేపట్టారు ఇందులో భాగంగా మంగళవారం ఆదిలాబాద్ పట్టణంలోని తెలంగాణ చౌక్ వద్ద ఐ లవ్ సిసిఐ సెల్ఫీ పాయింట్ ని  సాధన కమిటీ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే జోగు రామన్న పాల్గొని స్వయంగా సెల్ఫీ తీసుకున్నారు. ఈ సెల్ఫీలు సామాజిక మాధ్యమం లో ప్రధాని నరేంద్ర మోడీ కి ట్యాగ్ చేసి ఫ్యాక్టరీ పునరుద్ధరణ ఆవశ్యకత తెలపడానికి ప్రచారం నిర్వహిస్తున్నట్లు  ఎమ్మెల్యే జోగు రామన్న పేర్కొన్నారు. ఫ్యాక్టరీ ఏర్పాటుతో ఎంతో మంది యువతకు ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి లభిస్తుందన్నారు ఈ కార్యక్రమంలో సిసిఐ సాధన కమిటీ సభ్యులు పాల్గొన్నారు..

Related Posts