YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

తెరాస అందోళన

తెరాస అందోళన

సికింద్రాబాద్
పార్లమెంటు వేదికగా తెలుగు రాష్ట్రాల విభజన విషయంలో ప్రధాని నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ఓల్డ్ బోయిన్పల్లి డివిజన్ కార్పొరేటర్ ముద్దం నర్సింహ యాదవ్ తెరాస నాయకులు ఓల్డ్ బోయిన్పల్లి కూడలి వద్ద కేంద్రప్రభుత్వ దిష్టిబొమ్మ ను దగ్ధం చేశారు.. ప్రధాని నరేంద్ర మోడీ అమిత్ షా వ్యాఖ్యలకు నిరసనగా ఓల్డ్ బోయిన్పల్లి నుండి మూసాపేట్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించి నల్ల బ్యాడ్జీలతో నిరసన వ్యక్తం చేశారు. తెలుగు రాష్ట్రాల విభజన విషయంలో అనేక వివాదాలు తలెత్తుతాయని ఇతర సమస్యలు సమస్య లేదని ప్రధాని నరేంద్ర మోడీ అనడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.. ప్రధాని మోడీ తెలంగాణ పట్ల వివక్ష చూపుతున్నారని మరోసారి నిరూపితమైంది అని వెల్లడించారు. విభజన మూలంగానే తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికీ ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని ప్రధాని మోడీ పార్లమెంటు సాక్షిగా అవమానకరంగా మాట్లాడటం దారుణమని అన్నారు.. తెలంగాణలోని ఏడు మండలాలను అప్పనంగా తీసుకోవాలి ఆంధ్ర లో కలపడం మోడీ వివక్ష చూపడానికి కారణం కాదా అని ప్రశ్నించారు..

Related Posts