YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

సిఎం జగన్ వ్యాఖ్యలనకు ఖండించిన సీపీఎం మధు

సిఎం జగన్ వ్యాఖ్యలనకు ఖండించిన సీపీఎం మధు

విశాఖపట్నం
కమ్యూనిస్టులు తెలుగుదేశం పార్టీ వైపు ప్రయాణం చేస్తున్నారని ముఖ్యమంత్రి జగన్ అన్న మాటలను సిపిఎం పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు కామ్రేడ్ మధు ఖండించారు. వాస్తవానికి సీఎం జగన్మోహన్ రెడ్డి తెలుగుదేశం పార్టీ వైపు ప్రయాణం చేస్తున్నారని అన్నారు. జగదంబ వద్ద పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు ముఖ్యమంత్రి ఇచ్చిన వాగ్దానాలు తుంగలో తొక్కారని తెలిపారు. అంగన్వాడి, ఆశా వర్కర్లకు జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేక గత టీడీపీ ప్రభుత్వం వలే ప్రవర్తిస్తున్నారని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి అనుసరిస్తున్న రాజకీయ విధానం మంచిది కాదన్నారు. ఇప్పటికైనా మార్చుకోవాలని హితవు పలికారు. వైసీపీ ప్రభుత్వం అవలంబిస్తున్న లోపాలను ఇప్పటికైనా తెలుసుకుని అందరికీ సమన్యాయం చేయాలని డిమాండ్ చేశారు. మీడియాను, కమ్యూనిస్టులను, ఆశా వర్కర్ లను బెదిరించడం మానుకోవాలని సూచించారు. వాస్తవాలని వక్రీకరించి ప్రచారం చేయడం వలన ఈ ప్రభుత్వం ప్రజల విశ్వాసాన్ని కోల్పోతుందని అన్నారు.

Related Posts