YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్ దేశీయం

శ్రీవారిని దర్శించుకున్న గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్

శ్రీవారిని దర్శించుకున్న గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్

తిరుమల, ఫిబ్రవరి 10
రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ గురువారం శ్రీవారిని దర్శించుకున్నారు. ముందుగా ఆలయం వద్దకు చేరుకున్న | గవర్నర్కు టిటిడి ఛైర్మెన్  వై.వి.సుబ్బారెడ్డి, ఈవో డాక్టర్ కె.ఎస్.జవహర్రెడ్డి, అదనపు ఈవో  ఎవి. ధర్మారెడ్డి, సివిఎస్వో  గోపినాథ్ జెట్టి సాదరంగా అహ్వానించగా, అర్చక బృందం ''ఇస్తికఫాల్'' ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం ఆయన ధ్వజస్తంభానికి నమస్కరించి శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం మొక్కులు చెల్లించుకున్నారు. ఆ తరువాత రంగనాయకుల మండపంలో  అయనకు వేదపండితులు వేదాశీర్వచనం చేశారు. ఈ సందర్భంగా టిటిడి ఛైర్మన్, ఈవోలు తీర్థప్రసాదాలు అందించారు.  

శ్రీవారిని దర్శించుకున్న భారత పర్యాటక శాఖ మంత్రి
భారత పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి, ఏపీ రాష్ట్ర గవర్నర్తో కలిసి శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో ఈవో తీర్థప్రసాదాలు, శ్రీవారి చిత్రపటాన్ని అందించారు.  ఈ కార్యక్రమంలో ఒడిశా ఎల్ఎసి ఛైర్మన్  దుష్యంత్ కుమార్, డెప్యూటీ ఈవోలు రమేష్బాబు,  లోకనాథం.  భాస్కర్, తిరుపతి అదనపు ఎస్పీ  సుప్రజ, విజివో  బాలిరెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Related Posts