YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ దేశీయం

పర్యాటక అభివృద్ధికి రాష్ట్రాలకు కేంద్రం చేయూత: కిషన్ రెడ్డి

పర్యాటక అభివృద్ధికి రాష్ట్రాలకు కేంద్రం చేయూత: కిషన్ రెడ్డి

తిరుమల ఫిబ్రవరి 10
కరోనా కారణంగా దేశ వ్యాప్తంగా పర్యాటక రంగం దెబ్బతిన్నదని, పర్యాటక అభివృద్ధికి రాష్ట్రాలకు కేంద్రం చేయూతనందిస్తుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. ఎన్నో సంవత్సరాలుగా టీటీడీ అధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహిస్తోందని అన్నారు. గురువారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ జమ్మూ కాశ్మీర్‌లో శ్రీవారి ఆలయ నిర్మాణం ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. గో పరి రక్షణతో పాటు గో ఆధారిత పదార్ధాలతో.. టీటీడీ వస్తువులను తయారు చేయడం అభినందనీయమన్నారు. జాతీయ, అంతర్జాతీయంగా పర్యాటకానికి ప్రోత్సాహలను అందిస్తామన్నారు. దేశంలో 15 ప్రముఖ పర్యాటక కేంద్రాలను ప్రజలు సందర్శించే విధంగా చర్యలు తీసుకుంటామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు.

Related Posts