YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

కేసీఆర్ ఒక చెల్లని రూపాయి బండి సంజయ్

కేసీఆర్ ఒక చెల్లని రూపాయి బండి సంజయ్

హైదరాబాద్
కేసీఆర్ ఒక చెల్లని రూపాయి అని.. ఎవరైనా బీజేపీతో పెట్టుకుంటే మాడి మసై పోతారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. శనివారం మీడియాతో మాట్లాడిన బండి సంజయ్.. కేసీఆర్ పై ఖచ్చితంగా దర్యాప్తు జరుగుతదంన్నారు. ముఖ్యమంత్రి అయి ఉండి బాధ్యత లేకుండా మాట్లాడుతున్నారన్న బండి సంజయ్.. తెలంగాణలో కల్వకుంట్ల రాజ్యాంగాన్ని జనగామ సభ నుంచే అమలు చేస్తున్నానని భ్రమలో ఉన్నాడన్నారు. రాజ్యాంగం మార్పు వ్యాఖ్యలపై క్షమాపణలు చెబుతారని ఆశించామన్నారు. కేసీఆర్ మాటలను ఎవరూ పట్టించుకోవడం లేదన్నారు. ఎన్ని కుట్రలు చేసినా బీజేపీని ఏమీ చేయలేరన్నారు. కల్వకుంట్ల రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నా అని ప్రజలకు చూపెట్టేందుకే నిన్నటి బహిరంగ సభ అన్నారు. తెలంగాణలో కల్వకుంట్ల రాజ్యాంగం కావాలా ? అంబేద్కర్ రాజ్యాంగం కావాలా అని ప్రశ్నించారు. సీఎం సభ పెడితే ప్రభుత్వం చేసిన పనులు చెప్పాలని..డబుల్ బెడ్రూం, నిరుద్యోగ భ్రుతి ఎంత మందికి ఇచ్చావో చెప్పాలన్నారు.  సంక్షేమ పథకాల గురించి మాట్లాడాలి కానీ..బీజేపీపై మాట్లాడితే ఊరుకోమని హెచ్చరించారు. బీజేపీ కార్యకర్తలు అంటే కేసీఆర్ కుటుంబానికి వణుకని అన్నారు.

Related Posts