YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

కేసీఆర్ కారనజన్ముడు ఎమ్మెల్యే రోజా

కేసీఆర్ కారనజన్ముడు ఎమ్మెల్యే రోజా

యాదాద్రి
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కారణజన్ముడని అన్నారు ఎమ్మెల్యే రోజా. భీష్మ ఏకాదశి సందర్భంగా యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకున్న ఆమె అనంతరం పునర్నిర్మాణం జరుగుతున్న ఆలయాన్ని సందర్శించారు. ఎమ్మెల్యే రోజాకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన ఆలయ అధికారులు, వేద మంత్రాలతో ఆశీర్వచనం, తీర్థప్రసాదాలను అందజేశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఎమ్మెల్యే రోజా ఆలయం అద్భుతంగా పునర్ నిర్మాణం జరుపుకుంటుదని అన్నారు. యాదగిరి గుట్ట లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకోవడం ఆనందంగా ఉంది అన్న రోజా... అత్యంత శక్తిసంపన్నుడు లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం ముఖ్యమంత్రి కెసిఆర్ చేతుల మీదుగా పునర్నిర్మాణం జరగడం కెసిఆర్ పూర్వజన్మసుకృతం అని పేర్కొన్నారు.

Related Posts